News September 14, 2024
అమలాపురం: అత్యాచారయత్నం కేసులో ఏడేళ్లు జైలు శిక్ష
అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి వీర వెంకట సత్యనారాయణకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని రూరల్ సీఐ వీరబాబు శుక్రవారం తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఈ సంఘటన జరిగిందన్నారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించి అడ్డువచ్చిన అమ్మమ్మపై దాడి చేశారన్నారు.
Similar News
News October 6, 2024
ఆలమూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ఆలమూరు మండలం చొప్పెల్ల పంట కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని ఆలమూరు ఎస్సై అశోక్ ఆదివారం తెలిపారు. లాకులు దాటిన తర్వాత 40 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళ మృతదేహాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పచ్చ రంగు జాకెట్, బిస్కెట్ కలర్ లంగా ధరించి ఉందన్నారు. ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 6, 2024
ఆత్రేయపురం: జాతీయ హ్యాండ్ బాల్ జట్టులో ప్రణీత్ వర్మ
జాతీస్థాయి హ్యాండ్ బాల్ జట్టులో ఆత్రేయపురానికి చెందిన ముదునూరి ప్రణీత్ వర్మకు స్థానం దక్కించుకున్నాడు. సీ.బీ.యస్.ఇ సౌత్ జోన్ రాష్ట్రాలు పాల్గొన్న హ్యాండ్ బాల్ పోటీలలో అండర్ -19 విభాగంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తరపున ముదునూరి ప్రణీత్ వర్మ జట్టుకు ప్రథమ స్థానం లభించిందని స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో ప్రణీత్ వర్మను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
News October 6, 2024
సముద్రంలోకి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలు
రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రానికి 1,62,276 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరిందని పేర్కొన్నారు. అలాగే డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు.