News January 30, 2025

అమలాపురం: అరటి రైతులకు భారీ నష్టం..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో అరటి గెలలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. మార్కెట్‌కు పంట తీసుకెళ్తే.. గెలను రూ.30 నుంచి రూ.40కి మించి కొనడం లేదు. కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో డజన్ అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60కి విక్రయిస్తున్నారు. కోనసీమ రైతులకు గెలకు సైతం ఆ ధర దక్కకపోవడం విస్మయానికి గురి చేస్తోంది.

Similar News

News November 22, 2025

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కల ‘ధర’హాసం..!

image

అల్లూరి జిల్లాలో బస్తర్ పిక్కలు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గతవారం కిలో రూ.250 ధర ఉండగా శనివారం 300కి చేరిందని స్థానికులు తెలిపారు. అతి చల్లని ప్రదేశాలు ఉన్న చింతపల్లి, పాడేరు, ముంచింగిపుట్టు, డుంబ్రిగూడ మండలాల్లో కొండలపై గిరిజనులు ఈ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో పంటకు తీవ్రంగా నష్టం వచ్చిందని రైతులు అంటున్నారు. దిగుబడి లేక రేటు పెరిగిపోతుందన్నారు.

News November 22, 2025

గద్వాల్: సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

image

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. వచ్చే నెల డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పాత రిజర్వేషన్‌లతోనే ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం రోజున గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్ విడుదలకు రంగం సిద్ధమైంది. గద్వాల్ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.