News February 17, 2025

అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Similar News

News October 14, 2025

HYD: Get Ready.. ఏర్పాట్లు పూర్తి: VC

image

పాలమూరు వర్శిటీలోని ఈనెల 16న 4వ స్నాతకోత్సవనికి ఏర్పాట్లు పూర్తయ్యాయని వర్శిటీ ఉపకులపతి(VC) ఆచార్య జిఎన్ శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతున్నారని, వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ రెడ్డి (Dr.మన్నే సత్యనారాయణ రెడ్డి)కి పాలమూరు వర్శిటీ (పీయూ) గౌరవ డాక్టరేట్ గవర్నర్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

News October 14, 2025

శ్రీశైలం మాస్టర్‌ ప్లాన్‌పై సమీక్ష

image

శ్రీశైలం మాస్టర్‌ ప్లాన్‌పై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌తో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, అభివృద్ధి కార్యక్రమాల అమలు దశలను వివరించారు. శ్రీశైలం దేవస్థానాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

News October 14, 2025

తెనాలి: హత్యకు కుటుంబ వివాదాలే కారణమా..?

image

తెనాలి చెంచుపేటలో జూటూరి తిరుపతిరావు (బుజ్జి) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అమృతలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన తిరుపతిరావు పెదపూడి సొసైటీ మెంబర్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఐదుగురు కుమార్తెలు కాగా తెనాలిలోని ఓ కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఉదయం టిఫిన్ కోసం బయటికి వచ్చిన అతడిని ఓ వ్యక్తి నరికి చంపాడు. హత్యకు కుటుంబ వివాదాలే కారణమని సమాచారం.