News February 17, 2025

అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Similar News

News September 14, 2025

బిజినేపల్లి అత్యధిక వర్షపాతం నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో గడిచిన 24 గంటల వివిధ ప్రాంతాలో వర్షం కురిసింది. అత్యధికంగా బిజినేపల్లి మండల కేంద్రంలో 70.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యంగంపల్లి 48.5, కొండారెడ్డిపల్లి 45.0, పాలెం 35.5, మంగనూర్ 32.8, తెలకపల్లి 29.5, కిష్టంపల్లి 17.0, తోటపల్లి 15.0, ఉప్పునుంతల 7.5, కొల్లాపూర్ 11.3, లింగాల 6.8, ఐనోల్ 6.5, కల్వకుర్తి 3.0, ఊర్కొండ 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

News September 14, 2025

NRPT: చేప పిల్లల పంపిణీకి రంగం సిద్ధం

image

అంతిమంగా ఉచిత చేప పిల్లల సరఫరాకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేప పిల్లల పెంపకం కేంద్రాల నిర్వహకులకు జరిపిన సాంకేతిక నైపుణ్యం,నాణ్యత నిర్దేశాలకు అనుగుణంగా నారాయణపేట జిల్లాకు ఒక్కరే బిడ్ దాఖలు చేసినప్పటికీ గత్యంతరం లేక అధికారులు ఆమోదం తెలిపారు. గత నెలలోనే చెరువులు నిండుకున్న నేపథ్యంలో పంపిణీ ఆలస్యం అయిన తరుణంలో చేప పిల్లల సైజు, నాణ్యత ప్రమాణాలు పాటించడం ఇబ్బందికరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News September 14, 2025

తురకాపాలెం వరుస మరణాలకు కారణం యురేనియం?

image

తురకాపాలెంలో మరణమృదంగం కలకలం రేపింది. ఐతే మరణాలకు గల కారణాలు ఆ ప్రాంతంలోని యురేనియం అవశేషాలే అన్నట్లుగా చెన్నై ప్రయోగశాల నిర్ధారణ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల నమూనాలను సేకరించి చెన్నై ల్యాబ్‌కు పంపగా ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రాతంలో క్వారీలు ఉండటంతో అక్కడ నీటిని పలు సమయాల్లో వాడటంతోనే సమస్య ఏర్పడిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. గతంలో అధికారులు తెలిపిన వాటికి చెన్నై రిపోర్టు భిన్నంగా ఉంది.