News October 13, 2024

అమలాపురం: ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎంపికపై సర్వే

image

ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా సర్వే చేపట్టారు. అమలాపురం టీడీపీ యువ నాయకుడు చెరుకూరి సాయిరామ్, ముమ్మిడివరానికి చెందిన పేరాబత్తుల రాజశేఖర్, అమలాపురం టీడీపీ సీనియర్ నాయకుడు రమణబాబు, వాసంశెట్టి వెంకట సత్య ప్రభాకర్‌, జిల్లాకు చెందిన పలువురు నాయకులు పేర్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

Similar News

News October 13, 2024

తూ.గో జిల్లా వ్యాప్తంగా 253 గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలు

image

తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 253 గ్రామ పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంచాయతీ వారోత్సవాలు జరుగుతాయని ఆమె తెలిపారు.

News October 13, 2024

రంప: పర్యాటక ప్రాంతాలు మూసివేత

image

ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు ముసివేస్తున్నామని ITDA PO కట్టా సింహాచలం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండ వాగులు, కాలువలు, జలపాతాలు పొంగి ప్రవహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో పర్యాటకులు ఏజెన్సీకి రావద్దని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.

News October 13, 2024

అడ్డతీగల: వెల్లుల్లి ధర అదరహో

image

ఏజెన్సీ ప్రాంతం అయిన అడ్డతీగల పరిసర గ్రామాల్లో వెల్లుల్లి ధర గణనీయంగా పెరిగింది. నాణ్యమైనవి పెద్దవి 15రోజుల క్రితం కిలో రూ.300 పలుకగా నేడు రూ.400కి పెరిగింది. పంట తగ్గడంతో గిరాకీ పెరిగి రేటు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతానికి రాజమండ్రి నుంచి వీటిని వ్యాపారులు తీసుకొచ్చి విక్రయాలు జరుపుతారు. కూరగాయలు రేటు కూడా పెరగడం వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.