News April 7, 2025

అమలాపురం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 25 ఫిర్యాదులు

image

అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు 25 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదించాలన్నారు.

Similar News

News April 18, 2025

విశాఖలో అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

image

విశాఖ సిటీ పరిధిలో దొంగతనానికి గురైన 9బైక్‌లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కోరాపుట్‌కి చెందిన అంతర్రాష్ట్ర దొంగలు కార్తీక్ కిల్లో, బాబుల సుపియాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో రాయల్ ఎన్ ఫీల్డ్, యమహా, తదితర వాహనాలు ఉన్నాయి.

News April 18, 2025

ధరణి కారణంగా రైతులకు ఇబ్బందులు: మంత్రి

image

గతంలో అమల్లో ఉన్న ధరణి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారికి ఇచ్చిన హామీ ప్రకారం 18 రాష్ట్రాల్లో ఉన్న చట్టాలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని ప్రవేశపెట్టిందన్నారు. 45 రోజులు మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. చట్టానికి వంద రోజుల్లో విధి విధానాలు అమలు చేసుకుందామన్నారు.

News April 18, 2025

ఎన్టీఆర్: ‘MLA సీటు త్యాగం.. పది నెలలుగా ఎదురుచూపులు’

image

మాజీ మంత్రి దేవినేని ఉమ 2024 ఎన్నికలలో తన సిట్టింగ్ మైలవరం స్థానాన్ని వసంత కృష్ణప్రసాద్‌కు ఇచ్చారు. కూటమి గెలుపు అనంతరం ఉమకు MLC, రాజ్యసభ ఎంపీ, నామినేటెడ్ పదవి ఇవ్వనున్నారని వార్తలొచ్చినా చివరికి పదవి దక్కలేదు. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు పదవులు ఇవ్వాల్సి రావడంతో ఉమకు టీడీపీ అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. రానున్న రోజుల్లోనైనా ఉమ ఎదురుచూపులకు ఎండ్ కార్డు పడుతుందేమో చూడాలి. 

error: Content is protected !!