News April 7, 2025

అమలాపురం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 25 ఫిర్యాదులు

image

అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు 25 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై అందిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎస్పీ కార్యాలయానికి నివేదించాలన్నారు.

Similar News

News December 3, 2025

లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

image

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.

News December 3, 2025

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సుభాష్

image

రామచంద్రపురం మండలం కందులపాలెంలో బుధవారం జరిగిన ‘రైతన్నా-మీ కోసం’ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. సీఎంఆర్ పద్ధతిలో రైతులకు గిట్టుబాటు ధర అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఆర్డీఓ అఖిల, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News December 3, 2025

శ్రీశైల మల్లన్న సన్నిధిలో టీమిండియా క్రికెటర్లు

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను టీమిండియా క్రికెటర్లు జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనార్థమై బుధవారం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న వారికి అధికారులు, అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు అందజేసి, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో వారిని సత్కరించారు. వారివెంట దేవస్థానం ఏపీఆర్ఓ డాక్టర్ శివారెడ్డి ఉన్నారు.