News April 7, 2025

అమలాపురం: కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక

image

అమలాపురం టౌన్‌లోని కొంకాపల్లికి చెందిన 9 ఏళ్ల బాలిక కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలిక ఆదివారం ప్రైవేటుకు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు బలవంతంగా తీసుకెళ్తుండగా కలశం సెంటర్లో కారు ట్రాఫిక్‌లో చిక్కుకుండగా కిడ్నాపర్ చేతిని కొరికి తప్పించుకున్నట్లు ఫిర్యాదు చేశారని సీఐ వీరబాబు తెలిపారు.

Similar News

News October 21, 2025

ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

image

NLG: నార్కట్‌పల్లి మండలం అమ్మనబోల్ చౌరస్తా వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 21, 2025

నాగర్‌ కర్నూల్‌లో పోలీసు అమరవీరుల ర్యాలీ

image

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ‘పోలీస్ అమరవీరులకు జోహార్’ అంటూ నినాదాలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలు అర్పించిన అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువబోదని వారు పేర్కొన్నారు.

News October 21, 2025

డాక్టరేట్‌ సాధించిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ

image

సైన్స్‌‌లో డాక్టరేట్‌ పొందిన మొదటి భారతీయ మహిళ ఆసిమా ఛటర్జీ. పైటోమెడిసిన్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో నిపుణురాలైన ఈమె మూర్చ, మలేరియా మందులు అభివృద్ధి చేశారు. కలకత్తా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ విభాగంలో ఖైరా ప్రొఫెసర్‌షిప్‌ పొందారు. అక్కడ పలు విభాగాల్లో ప్రత్యేక హోదా పొందారు. 1960లో జాతీయ సైన్స్‌ అకాడమీ ఫెలోషిప్, 1961లో కెమిస్ట్రీలో చేసిన కృషికి ‘శాంతి స్వరూప్‌ భట్నాగర్‌’ అవార్డు పొందారు.