News April 7, 2025
అమలాపురం: కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్న బాలిక

అమలాపురం టౌన్లోని కొంకాపల్లికి చెందిన 9 ఏళ్ల బాలిక కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలిక ఆదివారం ప్రైవేటుకు వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదుగురు బలవంతంగా తీసుకెళ్తుండగా కలశం సెంటర్లో కారు ట్రాఫిక్లో చిక్కుకుండగా కిడ్నాపర్ చేతిని కొరికి తప్పించుకున్నట్లు ఫిర్యాదు చేశారని సీఐ వీరబాబు తెలిపారు.
Similar News
News November 7, 2025
వానొస్తే.. ట్రైసిటీ హడల్..!

ఉమ్మడి WGLలో ఇటీవల సంభవించిన వరదలు ట్రైసిటీ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వర్షం అంటేనే నాళాల పక్కన ఉన్న కాలనీల ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఏ సమయానికి వరదలు వచ్చి ఇళ్లు మునుగుతాయోనని, ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని ఆవేదన చెందుతున్నారు. WGLలో CM పర్యటించినా, ముంపునకు శాశ్వత పరిష్కారం దొరకలేదని, అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మీ కాలనీకి వరద వచ్చిందా?
News November 7, 2025
నిడదవోలులో యాక్సిడెంట్.. యువకుడి మృతి

నిడదవోలు ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. త్రిబుల్ రైడ్ చేస్తూ వస్తున్న ముగ్గురు యువకులు డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 7, 2025
బాలీవుడ్ నటి సులక్షణ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్ నటి, సింగర్ సులక్షణా పండిట్(71) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరుడు లలిత్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో సంగీత విద్వాంసుల కుటుంబంలో ఈమె జన్మించారు. తొలుత సింగర్గా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ‘సంకల్ప్’ మూవీలో పాటకు ఫిలింఫేర్ అందుకున్నారు. ఆ తర్వాత సంజీవ్ కుమార్, రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శత్రుఘ్నసిన్హా వంటి ప్రముఖుల సరసన నటించారు.


