News February 22, 2025
అమలాపురం: క్రీడాఅవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

2025–26 సంవత్సరానికి క్రీడలు, ఆట విభాగాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అవార్డు కోసం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కోనసీమ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ సురేష్కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లాలోని అర్హతగల క్రీడాకారులు, ఫుట్బాల్, హాకీ, క్రికెట్ బాలురు, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్ లు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News January 5, 2026
ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 5, 2026
హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడేది తెలుగే: చంద్రబాబు

AP: హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు అని CM చంద్రబాబు అన్నారు. మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచంలో తెలుగు జాతి నం.1గా ఉండాలి. దీనికి నేను కట్టుబడి ఉన్నాను. ఇంగ్లిష్ అవసరమే కానీ మాతృభాషను మరిస్తే మనల్ని మనమే మరిచినట్టు అవుతుంది. టెక్నాలజీతో తెలుగు కనుమరుగవుతుందనే భయం వద్దు. టెక్నాలజీతో తెలుగును కాపాడుకోవడం సులభం’ అని పేర్కొన్నారు.
News January 5, 2026
GWL: పదోన్నతి బాధ్యతను పెంచుతుంది- ఎస్పీ

పదోన్నతి గౌరవంతో పాటు బాధ్యతను మరింత పెంచుతుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా నూతన రిజర్వ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఆయన రాచకొండ కమిషనరేట్లో ఆర్ఎస్ఐగా పని చేసిన ఆయన ఇటీవల పదోన్నతి పొంది గద్వాల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్కు రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు.


