News February 22, 2025

అమలాపురం: క్రీడాఅవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

image

2025–26 సంవత్సరానికి క్రీడలు, ఆట విభాగాలలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు స్పోర్ట్స్‌ అవార్డు కోసం ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లు కోనసీమ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ సురేష్‌కుమార్‌ తెలిపారు. కోనసీమ జిల్లాలోని అర్హతగల క్రీడాకారులు, ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్‌ బాలురు, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు, కోచ్ లు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News December 9, 2025

పాలకొండ: బైక్ ఢీకొని వ్యక్తి మృతి

image

పాలకొండ మండలం పణుకువలస వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేకుంది. పణుకువలస జంక్షన్ వద్ద నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న పొట్నూరు రామినాయుడును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన రామినాయుడుని పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు పాలకొండ మండలం బుక్కూరు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

News December 9, 2025

డెక్ భవనంలో మార్పులు!

image

సిరిపురంలో ఉన్న ది డెక్ భవనం ఇటీవలి కాలంలో మంచి క్రేజ్ పొందింది. మొత్తం 11 అంతస్తులు ఉన్న ఈ భవనంలో 6 అంతస్తులను రైల్వే జోన్ కార్యాలయం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో పాటు పలు కంపెనీల ఆఫీసులకు కేటాయించారు. మిగిలిన 5 అంతస్తులను పార్కింగ్ కోసం ఉంచినప్పటికీ, వాటిని అద్దెకు ఇవ్వడానికి టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక పార్కింగ్ అంతస్తును ఆఫీస్ స్పేస్‌గా మార్చేందుకు వీఎంఆర్డిఏ సిద్ధమవుతోంది.

News December 9, 2025

సంగారెడ్డి: నేటి నుంచి వైన్స్ దుకాణాల బంద్

image

జిల్లాలో ఈనెల 11న జరుగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేటి సాయంత్రం నుంచి 11వ తేదీ వరకు వైన్స్, బార్లు, రెస్టారెంట్‌లు మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు సోమవారం తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.