News March 23, 2025

అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

image

ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమలాపురం డిపో నుంచి ఏప్రిల్ 5న ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కళ్యాణం పూర్తయిన తర్వాత భద్రాచలం నుంచి అమలాపురం రావడానికి మధ్యాహ్నం1:30 నుంచి రాత్రి 7 గంటల వరకు బస్సులు నడుపుతామన్నారు.

Similar News

News October 30, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..!

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు ఫొటోగ్రఫీ & వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సంవత్సరాలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు నవంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాలకు 9502593347 నంబర్‌ను సంప్రదించవచ్చు.

News October 30, 2025

కామారెడ్డి: ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

ఆయిల్ ఫాం సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి 100 ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యం నిర్ణయించామన్నారు. ఇది రైతులకు దీర్ఘకాలిక ఆదాయ వనరుగా మారుతుందని తెలిపారు.

News October 30, 2025

ASF: వైద్య కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

image

ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో గల ఖాళీల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ పత్రిక తెలిపారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను DMLT-30 & DECG – 30 సీట్లు ఉన్నాయన్నారు. అర్హత గల అభ్యర్థులు www.tgpmb.telangana.gov.in వెబ్సైట్‌లో అప్లై చేసుకోవాలన్నారు. దరఖాస్తు గడువును ఈ నెల 28 నుంచి నవంబర్ 27 వరకు పొడిగించినట్లు వెల్లడించారు.