News March 11, 2025

అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

image

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News November 14, 2025

నువ్వుల నూనెతో జుట్టు సమస్యలు దూరం

image

జుట్టు ఆరోగ్యానికి నువ్వుల నూనె ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు రాలడాన్ని, పొడిబారడాన్ని తగ్గించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు జుట్టు నల్లగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌ గుణాలు చుండ్రు, ఇతర ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయంటున్నారు నిపుణులు.

News November 14, 2025

MGB సీఎం అభ్యర్థి తేజస్వీ వెనుకంజ

image

ఆర్జేడీ కీలక నేత, MGB సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. రాఘోపూర్ నుంచి పోటీ చేసిన ఆయన 3,000 ఓట్లతో వెనుకపడ్డారు. 4వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి సతీశ్ కుమార్‌కు 17,599 ఓట్లు రాగా, తేజస్వీకి 14,583 ఓట్లు వచ్చాయి. ఇంకా 26 రౌండ్లు ఉన్నాయి.

News November 14, 2025

నెల్లూరు: KG మటన్ రూ.500.. బారులు తీరిన జనాలు

image

ఆఫర్స్ పెట్టీ కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే నెల్లూరులోని బీవీ నగర్‌లో జరిగింది. ఓ మటన్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కిలో మటన్ 500 రూపాయలే అని బోర్డ్ పెట్టడంతో చుట్టు పక్కల జనాలు అందరూ బారులు తీరారు. మార్కెట్‌లో 1000 రూపాయలకు దొరికే మటన్ రూ.500కి వస్తుండటంతో ఆ షాప్ వద్దకు జనాలు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం కాస్త రద్దీగా మారింది.