News March 11, 2025

అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

image

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.

Similar News

News November 16, 2025

పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

image

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.

News November 16, 2025

ఏలూరు: వాహనం ఢీకొని వలస కూలీ మృతి

image

వంతెన కింద నిద్రిస్తున్న ఓ వలస కూలీని గుర్తుతెలియని వాహనం బలిగొన్న ఘటన పెదపాడు మండలం తాళ్లమూడిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వల్లి కృష్ణమూర్తి (40) విజయరాయిలో పనుల కోసం వచ్చి, తాళ్లమూడి వంతెన కింద నిద్రిస్తుండగా వాహనం అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శారదా సతీశ్ తెలిపారు.

News November 16, 2025

ఆదిలాబాద్: తీరు మారని ప్రైవేటు ట్రావెల్స్

image

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ప్రైవేటు ట్రావెల్స్ తీరు మాత్రం మారడం లేదు. ఆదిలాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కామాక్షి ట్రావెల్స్ బస్సు కామారెడ్డి(D) సిద్ధిరామేశ్వర్‌నగర్ శివారులో శనివారం రాత్రి హైవేపై ఏర్పాటు చేసిన డ్రమ్ములను ఢీకొట్టింది. మిర్యాలగూడకు చెందిన డ్రైవర్‌ రమేష్‌ మద్యంతాగి బస్సు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 30 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.