News March 11, 2025
అమలాపురం: ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి

కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తరచూ జరిగే హాట్ స్పాట్లను గుర్తించి వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ జిల్లా రహదారి భద్రత కమిటీ సభ్యులకు సూచించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలపై, అవగాహన కార్యక్రమాల నిర్వహణ పై ఆయన అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News November 17, 2025
చిత్తూరు జిల్లా దివ్యాంగులకు గమనిక

చిత్తూరు జిల్లాలో దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ పరికరాల గుర్తింపు శిబిరాలు ఈనెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఏపీ వికలాంగుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19న చిత్తూరు, 20న కార్వేటినగరం, 21న ఐరాల, 22న నగరి, 23న సదుంలో శిబిరాలు ఉంటాయన్నారు.
News November 17, 2025
బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.
News November 17, 2025
ఇవాళ ఈ మంత్రం జపిస్తే ‘అకాల మృత్యు భయం’ తొలగుతుంది!

కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిష్ఠతో జపిస్తే శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని ప్రతీతి.
*‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’*


