News March 21, 2024

అమలాపురం: బీజేపీలోకి వైసీపీ MP భర్త

image

అమలాపురం రాజకీయం రసవత్తరంగా మారింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వైసీపీలో కొనసాగుతుండగా ఆమె భర్త టీఎస్ఎన్ మూర్తి బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. బీజేపీలో చేరిన మూర్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరిని గురువారం కలిశారు. పి.గన్నవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా మూర్తి పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 

Similar News

News December 9, 2025

టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు: డీఈఓ

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించినట్లు తూ.గో డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. రూ. 500 ఆలస్య రుసుముతో ఈ నెల 18వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు తాజాగా అవకాశం కల్పించారు. రూ. 50 రుసుముతో 12వ తేదీ వరకు, రూ. 200 ఫైన్‌తో 15వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 9, 2025

క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయి: కలెక్టర్ కీర్తి

image

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఎస్‌కెవిటి కళాశాలలో మంగళవారం సీడబ్ల్యూఎస్‌ఎన్ (CWSN) జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా జెండా ఊపి ఈ పోటీలను ప్రారంభించారు. ఆటల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బహుమతులు అందజేశారు.

News December 9, 2025

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

image

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్‌కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.