News April 5, 2025

అమలాపురం: మాజీ ఎంపీ హర్ష కుమార్‌పై కేసు నమోదు

image

అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్‌పై రాజానగరం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఎస్సై నాగార్జున మాట్లాడుతూ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై హర్షకుమార్ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్నారు. ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని కోరగా నేటికీ స్పందించలేదన్నారు. దీంతో ఆయనపై 196, 197 సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నారు.

Similar News

News December 10, 2025

NZB: ఓటేయడానికి ఇవీ తీసుకెళ్లండి !

image

ఓటర్లు తమ గుర్తింపు కోసం EPIC కార్డు (ఓటర్ ఐడీ) లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించిన ఈ క్రింది 18 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ​ఆధార్ కార్డు, ​పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ​పాన్ కార్డు, ​బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ పాస్‌బుక్(ఫొటోతో), ​రేషన్ కార్డు(ఫొటోతో), ​పట్టాదారు పాస్‌బుక్, ​ఉపాధి జాబ్ కార్డు, ​దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం(ఫొటోతో), ​పెన్షన్ తదితర పత్రాల్లో ఏదోకటి చూపించాలి.

News December 10, 2025

తిరుమల శ్రీవారి చెంత బయటపడ్డ మరో స్కాం

image

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వరుడిని మోసం చేసిన మరో స్కాం బయటకొచ్చింది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకు ఇచ్చే పట్టువస్త్రాల (సారిగ దుపట్టా) కొనుగోలులో భారీ మోసం, అక్రమాలు జరిగినట్లు TTD విజిలెన్స్ గుర్తించింది. నగరికి చెందిన VRS ఎక్స్‌పోర్ట్స్ ₹100 విలువ చేయని పాలిస్టర్ క్లాత్‌ను పట్టు అని ₹1400కు సరఫరా చేసినట్లు బోర్డుకు తెలిపింది. 2015-25 మధ్య ఇలా శ్రీవారి ఖజానా నుంచి ₹54 కోట్లు దోచుకుంది.

News December 10, 2025

MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.