News March 5, 2025

అమలాపురం: ‘మానవ వనరుల వినియోగంపై సమావేశం’

image

జిల్లాలోని వివిధ శాఖలో కార్యకలాపాలకు సంబంధించి మానవ వనరుల లభ్యత శిక్షణ కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నైపుణ్య అభివృద్ధి శాఖ జిల్లా కమిటీతో సమావేశం జరిగింది. వివిధ శాఖల్లో మానవ వనరుల వినియోగం వాటికి అవసరమైన శిక్షణలను నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలన్నారు.

Similar News

News March 15, 2025

జనసేనను బీజేపీలో విలీనం చేయడం మంచిది: తులసి రెడ్డి

image

జనసేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి పవన్ కళ్యాణ్‌కు సూచించారు. శనివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ మొదటి నుంచి బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందని, బీజేపీ చేతిలో వీళ్ల ముగ్గురూ కీలు బొమ్మలని అన్నారు. అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందన్నారు.

News March 15, 2025

ప్లాస్టిక్ వాడకండి: నన్నయ వీసీ

image

పర్యావరణానికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పిలుపునిచ్చారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ఆమె క్యాంపస్‌ను శుభ్రం చేశారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక ర్యాలీలోనూ ఆమె పాల్గొన్నారు.

News March 15, 2025

రోజూ సాయంత్రం వీటిని తింటున్నారా?

image

చాలామందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. అలా అని ఏదిపడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెనంపై వేయించిన శనగలు తింటే పోషకాలు అందుతాయి. ఉడకపెట్టిన మొక్కజొన్న తింటే ఫైబర్ లభిస్తుంది. బాదం పప్పు, నల్లద్రాక్ష, పిస్తా, వాల్‌నట్స్, పండ్లు వంటివి తింటే ప్రొటీన్లు లభిస్తాయి. నూనెలో ముంచి తీసిన బజ్జీలు, పునుగులు, పకోడీ వంటివి తింటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు.

error: Content is protected !!