News February 26, 2026

అమలాపురం: ముగ్గురు ఆర్డీవోల బదిలీ

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 26 మంది ఆర్డీవోలను అమరావతి జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. కాగా బదిలీ అయిన వారిలో కొత్తపేట ఆర్డీవో శ్రీకర్, రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల, అమలాపురం ఆర్డీవో కే.మాధవి ఉన్నారు. వీరి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Similar News

News April 16, 2026

అమరావతి ఓఆర్ఆర్ పనులకు లైన్ క్లియర్!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కృష్ణా జిల్లా రైతు వేసిన పిల్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని సీజే ధర్మాసనం ఆక్షేపించింది. ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ఓ వ్యక్తి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. పనులు కొనసాగించేందుకు NHAIకి అనుమతినిస్తూ, తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

News April 16, 2026

గద్వాల్ జిల్లాలో తగ్గేదేలే అంటున్న ఎండలు

image

గద్వాల్ జిల్లాలో ఎండలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెలంగాణ వెదర్‌మ్యాన్ రిపోర్ట్ ప్రకారం.. గద్వాల్ జిల్లాలో గురువారం గరిష్ఠ ఉష్ణోగ్రత 43.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో జనం రోడ్లపైకి రావడానికి భయపడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు.

News April 16, 2026

GNT: అమరావతి ఓఆర్ఆర్ పనులకు లైన్ క్లియర్!

image

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ఆపేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. కృష్ణా జిల్లా రైతు వేసిన పిల్ వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని సీజే ధర్మాసనం ఆక్షేపించింది. ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను ఓ వ్యక్తి ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోబోమని కోర్టు స్పష్టం చేసింది. పనులు కొనసాగించేందుకు NHAIకి అనుమతినిస్తూ, తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.