News March 28, 2025

అమలాపురం: రీసర్వే ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలి

image

ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రీసర్వే ప్రక్రియ చట్టపరమైన సూత్రాల అనుగుణంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిషాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లాలోని మూడు డివిజన్లకు చెందిన ఎమ్మార్వోలు, డిప్యూటీ ఎమ్మార్వోలు,మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వోలతో రీసర్వే పై శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పైలెట్ కార్యక్రమం పూర్తయిందని సర్వేను ప్రారంభించాలన్నారు.

Similar News

News December 13, 2025

సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

image

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News December 13, 2025

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

image

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.

News December 13, 2025

కొలనుపాక: గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి సన్మానం

image

కొలనుపాకలో ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ బలపరిచిన బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ సర్పంచిగా విజయం సాధించారు. అయితే విజయాలు, అపజయాలు సహజమని, గ్రామ అభివృద్ధి ముఖ్యమని భావించిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భీమగాని హేమలత సంతోష్.. యాకమ్మను సన్మానించారు. దీనిపై యాకమ్మ స్పందిస్తూ గ్రామ అభివృద్ధికి ఆమె సలహాలు, సూచనలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.