News February 2, 2025
అమలాపురం: వైసీపీ ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలి

వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఐదో తేదీన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ ప్రసాదును ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయిల్ కోరారు. శనివారం ఎస్పీ, డీఎస్పీలను కలిసి అనుమతికి దరఖాస్తు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగేంద్ర మణి, ఎంపీపీ శేషారావు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News January 4, 2026
ఈనెల 9 నుంచి అంతర్ రాష్ట్ర సంక్రాంతి క్రికెట్ కప్

రావినూతలలో దశాబ్దాలుగా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర సంక్రాంతి కప్ క్రికెట్ పోటీలు ఈనెల 9న ప్రారంభం కానున్నట్లు RSCA అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల నుంచి 16 జట్లు తలపడనున్నాయన్నారు. విజేతలకు వరుసగా రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.1 లక్ష నగదు బహుమతులు అందిస్తామన్నారు. ఈ క్రీడలకు గిరిబాబు హాజరవుతారని సమావేశంలో పాల్గొన్న సినీ నటుడు రఘుబాబు వెల్లడించారు.
News January 4, 2026
వాస్తు ఎందుకు పాటించాలి?

వాస్తు పాటించడమంటే గోడలు, దిశలు మార్చడం కాదని గాలి, వెలుతురు వంటి ప్రకృతి శక్తులతో మన జీవితాన్ని అనుసంధానించుకోవడమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి ప్రసరించే ఇంట్లో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. సానుకూల శక్తితో కుటుంబీకుల మధ్య సత్సంబంధాలు బలపడి, ఉన్నతమైన ఆలోచనలను ప్రేరేపిస్తాయి. సమాజంలో గౌరవాన్ని, ఆర్థిక వృద్ధిని అందిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 4, 2026
అంధకారంలో వెనిజులా.. స్తంభించిన జనజీవనం

వెనిజులాపై అమెరికా <<18750335>>వైమానిక దాడుల<<>> తర్వాత ఆ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. విద్యుత్ గ్రిడ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రాజధాని కరాకస్ సహా ప్రధాన నగరాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. ఆహారం, అత్యవసర మందుల కోసం ప్రజలు బారులు తీరారు. ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి ప్రజలు రోడ్లపై పనిచేస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ వద్దకు చేరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది.


