News February 2, 2025

అమలాపురం: వైసీపీ ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలి

image

వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఐదో తేదీన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ ప్రసాదును ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయిల్ కోరారు. శనివారం ఎస్పీ, డీఎస్పీలను కలిసి అనుమతికి దరఖాస్తు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగేంద్ర మణి, ఎంపీపీ శేషారావు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.

Similar News

News December 9, 2025

పిల్లలు మొండిగా చేస్తున్నారా?

image

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.

News December 9, 2025

విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

image

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.

News December 9, 2025

జగిత్యాలలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఈరోజు కనిష్ఠంగా కథలాపూర్, మన్నెగూడెంలో 9.1℃, రాఘవపేట 9.3, ఐలాపూర్ 9.4, గుల్లకోట 9.5, మల్లాపూర్ 9.5, మేడిపల్లి, పేగడపల్లి, నేరెళ్ల 9.6, గోవిందారం 9.7, రాయికల్, జగ్గాసాగర్ 9.8, పూడూర్, బుద్దేశ్‌పల్లి 9.9, అల్లీపూర్లో 10.0℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఈ ప్రాంతాలన్నింటికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.