News February 2, 2025
అమలాపురం: వైసీపీ ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలి

వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఐదో తేదీన కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ఫీజు పోరు ధర్నాకు అనుమతి ఇవ్వాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ ప్రసాదును ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇజ్రాయిల్ కోరారు. శనివారం ఎస్పీ, డీఎస్పీలను కలిసి అనుమతికి దరఖాస్తు చేశారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్ పర్సన్ నాగేంద్ర మణి, ఎంపీపీ శేషారావు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.
Similar News
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.
News November 18, 2025
10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని TTD తెలిపింది. నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని, వీరికి మాత్రమే మొదటి 3 రోజులు దర్శనానికి అనుమతిస్తారని పేర్కొంది. తర్వాత 7రోజులు సర్వదర్శనం(ఉచితం) ఉంటుందని వెల్లడించింది. పది రోజుల్లో 182 గంటలు దర్శన సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకు అనుమతిస్తామని పేర్కొంది.
News November 18, 2025
తిరుమల: వాళ్లకు దర్శనం ఎలా గోవిందా..?

తిరుమల వైకుంఠ ద్వార <<18320086>>దర్శనానికి <<>>సంబంధించి మొదటి 3రోజులకు ఆన్లైన్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తెలియని భక్తుల పరిస్థితి ఏంటి? 100 కిలో మీటర్లు నడిచి ఆ 3రోజులు తిరుమలకు వచ్చే తమిళనాడు భక్తులకు దర్శనం దొరికేది ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.


