News March 30, 2025

అమలాపురం: సోమవారం పీజీఆర్ఎస్ రద్దు

image

ఈనెల 31న సోమవారం రంజాన్ సెలవు ప్రభుత్వ దినం కావున జిల్లా డివిజన్, మండల స్థాయిలలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాలు నిర్వహించడం లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కావున ఈ ప్రభుత్వ సెలవు విషయాన్ని అర్జీదారులు గమనించి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించ వలసిందిగా ఆయన ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Similar News

News December 5, 2025

వరి కోయ కాలు కాల్చితే భూమి నిర్వీర్యం: DAO

image

PDPL వ్యవసాయశాఖ రైతులకు కీలక సూచనలు జారీ చేసింది. వరి కోయ కాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి భూమి నిర్వీర్యమై పంట దిగుబడి తగ్గిపోతుందని DAO శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంటావశేషాలను కాల్చకుండా సూపర్ పాస్ఫేట్‌ చల్లి నీరు పెట్టి దున్నితే సేంద్రియ పదార్థం పెరిగి ఎరువుల ఖర్చు తగ్గి, పంటల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు. రైతులు ఈ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News December 5, 2025

గురు భవానీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఈవో

image

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవాని దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. డిసెంబర్ 11–15 వరకు సేవలందించే గురు భవానీలు తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం Google Play Storeలో Bhavani Deekshalu యాప్ అందుబాటులో ఉందని, గుర్తింపు పత్రాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు.

News December 5, 2025

JGL: 941మంది సర్పంచ్ స్థానాలకు పోటీ

image

జగిత్యాల జిల్లాలో ఈనెల 14న జరిగే 2 విడత ఎన్నికల్లో జరిగే 7మండలాల్లో మొత్తం 144 సర్పంచ్, 1276 వార్డు స్థానాలు ఉన్నాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 144 సర్పంచి స్థానాలకు గాను, మొత్తం 941 మంది, అలాగే 1276 వార్డు స్థానాలకు గాను, మొత్తం 2927 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరంతా ఈనెల 14న జరిగే 2వ విడత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.