News April 14, 2025
అమలాపురానికి చెందిన క్రీడాకారుడు వీర్రాజు మృతి

అమలాపురానికి చెందిన క్రీడాకారుడు బిళ్ల వీర్రాజు (65) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పరుగుల రాజు వీర్రాజు క్రీడల్లో పరుగు పందెం అండర్-50, 60 విభాగాల్లో వందలాది బంగారు పతకాలు సాధించారు. అంబేడ్కర్ కోనసీమ క్రీడా వైభవాన్ని నలు దిశలు చాటి గుర్తింపు తెచ్చుకున్నారు. వీర్రాజు మృతి పట్ల క్రీడా అభిమానులు, క్రీడ సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు.
Similar News
News November 2, 2025
మైపాడు బీచ్లో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల మృతి

మైపాడు బీచ్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. బీచ్లో స్నానానికి దిగి ఇంటర్ విద్యార్థులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హుమయూన్, తాజిన్, ఆదిల్గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 2, 2025
లైవ్ కాన్సర్ట్.. 73 ఫోన్లు కొట్టేశారు

ప్రముఖ స్పానిష్ పాప్ సింగర్, గ్రామీ అవార్డు విజేత ఎన్రిక్ ఇగ్లేసియాస్ ఇటీవల ముంబైలో నిర్వహించిన లైవ్ కాన్సర్ట్లో దొంగలు చేతివాటం చూపించారు. రూ.23.85 లక్షల విలువైన 73 ఫోన్లను కొట్టేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు 7 FIRలు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం ముంబైలోని MMRDA గ్రౌండులో జరిగిన ఈ కాన్సర్ట్ ఎంట్రీకి మినిమం టికెట్ ధర రూ.7వేలు. 25వేల మందికి పైగా హాజరయ్యారు.
News November 2, 2025
సాగులో వేప వినియోగం – ఫలితాలు అద్భుతం

వ్యవసాయంలో చీడపీడల నివారణలో క్రిమి సంహారక గుణాలు కలిగిన వేప ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వేప నుంచి తయారయ్యే పదార్థాల్లో వేపపిండి, వేప నూనె ముఖ్యమైనవి. వేపనూనె, వేప గింజల కషాయాన్ని ఫార్ములేషన్స్, సస్యరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నత్రజని ఎరువుల వినియోగ సామర్థ్యాన్నిపెంచడం, నులిపురుగుల నియంత్రణ, భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ల కట్టడి, చీడపురుగుల నియంత్రణకు వేప పిండి ఉపయోగపడుతోంది.


