News April 16, 2025
అమల్లోకి భూభారతి చట్టం: హనుమకొండ కలెక్టర్

ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం జిల్లాలో అమల్లోకి వచ్చిందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లాలోని తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Similar News
News November 17, 2025
భూపాలపల్లి: ‘జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించాలి’

భూపాలపల్లి జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించడానికి ప్రతి ఆరోగ్య సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆసుపత్రులు లేదా వైద్య సదుపాయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News November 17, 2025
భూపాలపల్లి: ‘జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించాలి’

భూపాలపల్లి జిల్లాలో వైద్యసేవలు నాణ్యతగా, పారదర్శకంగా అందించడానికి ప్రతి ఆరోగ్య సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం భూపాలపల్లిలోని ఐడీఓసీలో జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న ఆసుపత్రులు లేదా వైద్య సదుపాయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
News November 17, 2025
భూపాలపల్లి: ‘ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం మంజూరు నగర్లో భూపాలపల్లి నూతన ఇండియా బ్యాంక్ శాఖను రిబ్బన్ కట్ చేసి కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు ఆధునిక, సమగ్ర బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండియా బ్యాంక్ జిల్లాలో నూతన శాఖను ప్రారంభించినట్లు తెలిపారు.


