News July 18, 2024

అమిత్‌షా ఆదేశాలు.. పుంగనూరులో విచారణ

image

తనకు స్కాలర్‌షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్‌షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News September 18, 2024

తిరుపతి : రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాలకు గురువారం ఉదయం 11 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. కోఆర్డినేటర్స్-4, టీచర్స్-16 మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News September 18, 2024

తిరుపతి: 108లో ఉద్యోగ అవకాశాలు

image

108 వాహనాల్లో ఫైలట్ (డ్రైవర్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి 108 సర్వీస్ జిల్లా మేనేజర్ సంజీవ రెడ్డి తెలిపారు. ఫైలెట్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు తిరుపతి మధురానగర్ లోని 108 సర్వీసెస్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News September 18, 2024

తిరుమల: 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.