News January 19, 2025
అమిత్షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు

కేంద్రమంత్రి అమిత్షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.
Similar News
News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. LATEST UPDATES

* కృష్ణలంక పీఎస్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు* కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు* వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చే అవకాశం* కృష్ణలంక పీఎస్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య* వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు* విశాఖ నుంచి పటమట పీఎస్కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు
News February 13, 2025
కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
News February 13, 2025
వల్లభనేని వంశీ అరెస్ట్.. జిల్లాలో 144 సెక్షన్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లాలో ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వైసీపీ కీలక నేతల్ని హౌస్ అరెస్ట్ చేయటంతోపాటు జిల్లా అంతటా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ – 30ని అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో ఎటువంటి నిరసనలు, ఆందోళనలకు తావులేకుండా నిషేదాజ్ఞలు జారీ చేశారు.