News April 16, 2025
అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 10, 2025
26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్కు రూ.100, ఇంటర్కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్కు రూ.500, ఇంటర్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
News December 10, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
News December 10, 2025
టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.


