News April 16, 2025
అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 26, 2025
జగిత్యాలలో శాంతియుత ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి

గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 7 మండలాల్లో 122 పంచాయతీలకు, రెండవ విడతలో 144, మూడవ విడతలో 119 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
News November 26, 2025
జగిత్యాల: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్ (లోకల్ బాడీస్) తదితరులు పాల్గొన్నారు.
News November 26, 2025
రేపటి నుంచి RRB గ్రూప్ డీ పరీక్షలు

RRB గ్రూప్-D పరీక్షలను రేపటి నుంచి జనవరి 16 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షకు 4 రోజుల ముందు మెయిల్కు సమాచారం పంపిస్తారు. ఆతర్వాత అడ్మిట్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా 32,438 పోస్టులను భర్తీ చేయనుంది. వెబ్సైట్: https://www.rrbcdg.gov.in/


