News April 16, 2025
అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
సత్యసాయి రూ.100 నాణెం.. ఇలా కొనొచ్చు!

పుట్టపర్తి సత్యసాయి బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని మోదీ విడుదల చేసిన <<18336129>>రూ.100<<>> స్మారక నాణేన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కాయిన్ను ఎక్కడి నుంచి ఎలా కొనుగోలు చేయాలనే విషయమై ఆరా తీస్తున్నారు. www.indiagovtmint.in అనే వెబ్సైట్ ద్వారా ఈ నాణేలను కొనుగోలు చేయొచ్చు. ఒక్కో కాయిన్ ధర రూ.5,280గా నిర్ణయించారు.
News November 20, 2025
ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం..?

ములుగు జిల్లాలో గుప్తనిధుల కలకలం చర్చనీయాంశంగా మారింది. మంగపేట(M)కి చెందిన కొందరు ఇటీవల మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో తవ్వకాలు జరపగా, బంగారం దొరికినట్లు సమాచారం. వాటి విలువ రూ.కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. వారితో పాటు వెళ్లిన కొందరికి వాటా ఇవ్వకపోవడంతో ఈ విషయం బయటికి పొక్కింది. ఆనోట ఈనోట తిరిగి, పోలీసుల దాకా చేరినట్లు తెలుస్తోంది. SP విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
News November 20, 2025
ఇస్రోలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


