News April 16, 2025
అమెరికాలో అనారోగ్యంతో మధిర వాసి మృతి

మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన వెలగపూడి రమేశ్ అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రమేశ్ అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మృతదేహాన్ని అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు రమేశ్ ఫ్రెండ్స్, తానా కమిటీ వారు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 7, 2025
రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.
News November 7, 2025
DEC నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

ప్రైవేట్ టెలికం కంపెనీలు డిసెంబర్ 1 నుంచి రీఛార్జ్ రేట్లను పెంచే అవకాశం ఉందని నేషనల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దాదాపు 10% వరకు పెరగవచ్చని పేర్కొన్నాయి. 5G సర్వీస్ విస్తరణ, నెట్వర్క్ మెయింటనెన్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, రెవెన్యూ పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. టారిఫ్స్ పెంచితే ఉదాహరణకు రోజుకు 2GB 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ ధర రూ.949 నుంచి రూ.999కి పెరిగే అవకాశం ఉంది.
News November 7, 2025
యువత కోసం CMEGP పథకం!

AP: యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా CM ఉపాధి కల్పన (CMEGP) పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్కి ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది. గ్రామీణ యువతకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సేవారంగంలో రూ.2లక్షల-రూ.20 లక్షలు, తయారీ రంగంలో రూ.10 లక్షల-రూ.50 లక్షల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, ఈనెల 10న క్యాబినెట్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.


