News August 22, 2024
అమెరికాలో ఎసెన్షియా ఓనర్..?

యాదగిరి పెండ్రీ అనే వ్యక్తి ఎసెన్షియా కంపెనీనీ తొలిసారి 2007లో అమెరికాలో స్థాపించారు. తర్వాత హైదరాబాద్, విశాఖపట్నానికి ఆ కంపెనీ విస్తరించింది. అచ్యుతాపురం సెజ్లో ఈ కంపెనీ 2016లో రిజిస్టర్ అయ్యింది. 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వివిధ రకాల సిరప్లతో పాటు కొత్ మెడిసిన్ కోసం ప్రయోగాలు చేస్తుంటారు. కాగా ప్రస్తుతం పెండ్రీ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 24, 2025
విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్లోనూ eChallan & icon enable చేశారు. యాప్లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.
News November 24, 2025
విశాఖలో హోంగార్డు అనుమానాస్పద మృతి.!

విశాఖ స్టీల్ ప్లాంట్లో డిప్యుటేషన్పై పనిచేస్తున్న హోంగార్డు బి.కృష్ణారావు (56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం కూరగాయల కోసం బయటకు వెళ్లిన ఆయన కాసేపటికే విశాఖలోని 104 ఏరియా రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించారు. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఇది ఆత్మహత్యా లేక ప్రమాదమా అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు.
News November 24, 2025
విశాఖ తీరంలో విషాదం.. మరో మృతదేహం లభ్యం

విశాఖ లైట్ హౌస్ బీచ్లో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల ఘటన విషాదాంతమైంది. ఆదివారం తేజేశ్ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం ఆదిత్య మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చిందని త్రీ టౌన్ సీఐ పైడయ్య తెలిపారు. సముద్ర స్నానానికి దిగి అలల ధాటికి వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


