News February 9, 2025

అమెరికాలో ఖమ్మం జిల్లా యువకుడి సూసైడ్

image

అమెరికా న్యూయార్క్‌లో ఖమ్మం జిల్లా యువకుడు తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి సూసైడ్ చేసుకున్నారు. చదువుకుంటూ, పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సాయి కుమార్ ఆఫీసులోనే పాస్ పోర్టు వదిలేసినట్లు సమాచారం. అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 7, 2026

మానవపాడు: 1200 ఏళ్ల చరిత్ర.. అరుదైన విగ్రహాల గుర్తింపు

image

మానవపాడు మండలంలోని బోరవెల్లిలో అరుదైన చారిత్రక సంపదకు నిలయంగా నిలుస్తోందని, బాదామి చాళుక్యుల నుంచి నిజాం కాలం వరకు ఉన్న వివిధ రాజవంశాల ఆనవాళ్లను సోమవారం పరిశోధించి గుర్తించామని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. 8వ శతాబ్దం బాదామి చాళుక్యుల కాలపు చండి, చాముండి విగ్రహాలని గుర్తించారు. 1200 ఏళ్ల వారసత్వాన్ని కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు

News March 7, 2026

ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: పొంగులేటి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గ్రామాల్లో 3.60L ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో లక్ష యూనిట్లకు ఈ నెల 31లోగా గృహ ప్రవేశాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు నగదు చెల్లింపులను నిలిపేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకూ అర్హుల ఎంపికను ఈ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. APRలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.

News March 7, 2026

మమతకు నాపై కోపం ఉండొచ్చు.. కానీ: ద్రౌపదీ ముర్ము

image

WB పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు చేదు అనుభవం ఎదురైంది. అంతర్జాతీయ ఆదివాసీ సదస్సు కోసం అక్కడికి వెళ్లిన రాష్ట్రపతికి CMతో పాటు అధికారులెవరూ స్వాగతం పలకలేదు. అటు సిలిగుడిలోని సభకు అనుమతి ఇవ్వకుండా వేదికను గోసైన్‌పూర్‌కు మార్చడంపై ముర్ము అసహనం వ్యక్తం చేశారు. ‘మమతకు నాపై కోపం ఉండొచ్చు. కానీ నాకు ద్వేషం లేదు. ఆమె నాకు సోదరి లాంటివారు. ఆదివాసీలు ఏకం కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు’ అని అన్నారు.