News March 14, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు

image

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు జరిగాయి. ఏర్పేడు (M) గోవిందవరానికి చెందిన మోహన్ అమెరికాలోని మెఫ్పిస్, టెనస్సీలో ఉంటున్నారు. నిన్న రాత్రి తన ఫ్రెండ్‌తో కారులో వెళ్లగా.. దుండగుడు తుపాకీతో కాల్చాడు. మోహన్ భుజం, చేతికి బుల్లెట్లు తగిలాయి. గాయాలతోనే కారు నడిపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాళహస్తి MLA బొజ్జల ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News December 10, 2025

150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>RITES <<>>150 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జనవరి 11న రాత పరీక్ష నిర్వహిస్తారు. నెలకు జీతం రూ.29,735 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News December 10, 2025

అన్‌క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

image

బ్యాంకుల్లో ₹78,000Cr అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్‌లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.

News December 10, 2025

జిల్లావ్యాప్తంగా 620 వార్డులు ఏకగ్రీవం

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు వెల్లడించారు.