News March 14, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు

image

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడిపై కాల్పులు జరిగాయి. ఏర్పేడు (M) గోవిందవరానికి చెందిన మోహన్ అమెరికాలోని మెఫ్పిస్, టెనస్సీలో ఉంటున్నారు. నిన్న రాత్రి తన ఫ్రెండ్‌తో కారులో వెళ్లగా.. దుండగుడు తుపాకీతో కాల్చాడు. మోహన్ భుజం, చేతికి బుల్లెట్లు తగిలాయి. గాయాలతోనే కారు నడిపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై శ్రీకాళహస్తి MLA బొజ్జల ఆరా తీశారు. అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Similar News

News October 30, 2025

విశాఖ నగర డీసీపీ-1గా జగదీశ్ అడహళ్లి నియామకం

image

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.

News October 30, 2025

మంచిర్యాల: నవంబర్ 1 నుంచి రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి

image

నవంబర్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించనున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య తెలిపారు. ఇందులో భాగంగా రేషన్ సన్న బియ్యం కోసం ఒక వేలిముద్ర, నాన్ ఓవెన్ సంచి కోసం ఒక వేలిముద్ర ఇవ్వవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఏ చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డు కలిగి ఉన్నారో అక్కడ మాత్రమే వేలిముద్రతో నాన్ ఓవెన్ సంచి ఇస్తామని తెలిపారు.

News October 30, 2025

మంచిర్యాల: ‘అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు’

image

వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఛీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ శశిధర్ రాజు తెలిపారు. జైపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళ తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.