News April 15, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడి మృతి

image

తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో కన్నుమూశారు. వెంకటగిరి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బాబ్జి కుమారుడు రవితేజ(35) అమెరికా వెళ్లారు. అక్కడ ఫీడ్ ఎక్స్ కంపెనీలో వైర్లెస్ నెట్వర్క్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మూడేళ్లక్రితం అమెరికాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఈక్రమంలో రవితేజ చనిపోయారని ఆయన తండ్రికి సమాచారం అందింది. ఎలా చనిపోయారనేది తెలియాల్సి ఉంది.

Similar News

News November 14, 2025

ఏపీ ఉక్కురంగంలో జపాన్ పెట్టుబడులు: ఓనో కేయిచ్చి

image

AP: విశాఖ సీఐఐ పార్ట్‌నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న జపాన్ రాయబారి ఓనో కేయిచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఏపీ స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం కావాలని CM కోరారు. CII సమ్మిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News November 14, 2025

ములుగు జిల్లాలో 8663 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు

image

మధుమేహం.. షుగర్ వ్యాధిగా పిలుచుకునే ఈ రుగ్మత అతివేగంగా వ్యాపిస్తోంది. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతోంది. పసిబిడ్డలకు కూడా షుగర్ వ్యాధి బయటపడటం ఆందోళనకరం. ములుగు జిల్లాలో 8663 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. క్రమంతప్పని వ్యాయామం, సంతులిత ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్‌ను అదుపు చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం.

News November 14, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు
➤ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పోటీలు
➤ అనకాపల్లిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు
➤ డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నర్సీపట్నంలో పోలీసుల సైకిల్ ర్యాలీ
➤ వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమాలు
➤ రాజయ్యపేటలో మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన
➤ మాడుగుల అభివృద్ధి బ్రోచర్‌ను మంత్రి లోకేశ్‌కు అందజేసిన ఎమ్మెల్యే