News April 15, 2025

అమెరికాలో తిరుపతి జిల్లా యువకుడి మృతి

image

తిరుపతి జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాలో కన్నుమూశారు. వెంకటగిరి పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బాబ్జి కుమారుడు రవితేజ(35) అమెరికా వెళ్లారు. అక్కడ ఫీడ్ ఎక్స్ కంపెనీలో వైర్లెస్ నెట్వర్క్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. మూడేళ్లక్రితం అమెరికాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. ఈక్రమంలో రవితేజ చనిపోయారని ఆయన తండ్రికి సమాచారం అందింది. ఎలా చనిపోయారనేది తెలియాల్సి ఉంది.

Similar News

News December 9, 2025

మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 9, 2025

కడప జిల్లా SP కీలక సూచన.!

image

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.

News December 9, 2025

సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.