News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్బాగ్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.
News November 27, 2025
రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ.. ఖమ్మంలో కూల్చివేతలు

ఖమ్మం నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్ కాంప్లెక్స్లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు.
News November 27, 2025
రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త

AP: రేషన్షాపులను విలేజ్ మాల్స్గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్తోపాటు పప్పులు, నూనెలు, గోధుమ పిండి, రవ్వ తదితర 15 రకాల వస్తువులను తక్కువ ధరకు ఇవ్వనుంది. దీనివల్ల రేషన్ డీలర్లకు అదనపు ఆదాయంతోపాటు పేదలకు లబ్ధిచేకూరుతుందని భావిస్తోంది. ఇప్పటికే రేషన్ డీలర్లతో చర్చించింది. మరోవైపు లబ్ధిదారులకు బియ్యం, షుగర్తోపాటు రాగులు, జొన్నలు, కొర్రలు నేటి నుంచి దశలవారీగా ప్రభుత్వం ఇవ్వనుంది.


