News March 23, 2025
అమెరికాలో మెడికల్ సీటు సాధించిన ఖమ్మం విద్యార్థి

ఖమ్మం నగరానికి చెందిన రాజావాసిరెడ్డి నేహాశివాని అమెరికాలోని ప్రతిష్టాత్మక వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో ఎండీ జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ సీటు సాధించారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో శివాని ఈ ఘనత సాధించారు. వివిధ దశలలో నిర్వహించే మెడికల్ లైసెన్సింగ్ ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి మొదటి ప్రయత్నంలోనే వెస్ట్ వర్జీనియా విశ్వవిద్యాలయంలో సీటు సాధించడం విశేషం.
Similar News
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.
News November 18, 2025
ప్రకాశం: అన్నదాత సుఖీభవ నగదు జమ.. ఎంతమంది అర్హులంటే?

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రేపు రెండవ విడత అన్నదాత సుఖీభవ నగదు జమ కానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 268165 మంది రైతులకు రూ.134 కోట్లు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జమవుతుందని, అలాగే 21వ విడత పిఎం కిసాన్ పథకం నగదు రూ.231000 మంది రైతులకు రూ. 46.28 కోట్లు నగదు జమ కానుందన్నారు.


