News October 16, 2024
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో కన్నుమూశారు. ఓజిలి మండలం రాజుపాలేనికి చెందిన రవీంద్ర మెస్ యజమాని తిరుమూరు రవీంద్ర కుమారుడు గోపి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అమెరికాలోని రాడాల్ఫ్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం మృతిచెందారు. స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News February 24, 2026
నెల్లూరు: తొలిరోజు 566 మంది డుమ్మా

నెల్లూరు జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం తొలి పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆర్ఐవో వరప్రసాదరావు తెలిపారు. జిల్లాలో 81 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 26,034 మంది విద్యార్థులకు గాను 25,468 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. 566 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రకటించారు.
News February 24, 2026
నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్గా, నూరుల్లా ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.
News February 24, 2026
నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

పదేళ్ల క్రితం జరిగిన బైక్ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్కల్యాణ్ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.


