News July 29, 2024
అమెరికాలో HYDకు చెందిన యువకుడు మృతి

HYD రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని చికాగోలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. గత శనివారం (21న) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరణించిన యువకుడు అక్షిత్ రెడ్డిది (26) స్వగ్రామం మహబూబ్నగర్ జిల్లా కాగా..HYD కాటేదాన్లో స్థిరపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి MS పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్నాడు. జులై 27న మృతదేహం HYD చేరుకోగా.. స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు.
Similar News
News November 22, 2025
HYD: పెళ్లి కావట్లేదని అమ్మాయి చనిపోయింది..!

ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట(D) మద్దూర్(M) రేబర్తి వాసి కుంటి నిరోష(32) సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తోంది. చింతల్ పద్మానగర్లో తన సోదరుడు నరేశ్తో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు పెళ్లి కావట్లేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT
News November 22, 2025
రూ.3,900 టికెట్.. హైదరాబాద్-అరుణాచలం టూర్

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం HYD–2 డిపో (DSNR) నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. DEC 3న 7PMకు DSNR, 8PMకు MGBS నుంచి బయల్దేరుతాయి. కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయి. DEC 5న తిరుగు ప్రయాణమై, మరుసటి రోజు ఉ.6 గం.కు HYDకు చేరుకోవచ్చు. ఒక్కరికి రూ.3,900గా టికెట్ ధర నిర్ణయించారు. బుకింగ్ కోసం tgsrtcbus.in /9959444165, 9346559649 సంప్రదించాలన్నారు.
SHARE IT


