News June 23, 2024
అమెరికా, దక్షిణ కొరియా నుంచి ఫణిగిరికి బౌద్ధ శిల్పాలు

ఫణిగిరి బౌద్ధ శిల్పాలు, జాతక కథలు తెలిపే తోరణాలను గత ఏడాది జులైలో అంతర్జాతీయ ప్రదర్శన నిమిత్తం USలోని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియానికి, దక్షిణకొరియా సియోల్కి తీసుకెళ్లారు. ప్రదర్శన ముగిసిన అనంతరం శనివారం వీటిని తిరిగి ఫణిగిరి మ్యూజియంలో భద్రపర్చినట్లు ఆర్కియాలజీ AD మల్లునాయక్ తెలిపారు. ప్రపంచంలోని పురవస్తు శాఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఫణిగిరి బౌద్ధ శిల్పాలను సందర్శించారని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2025
NLG: ఇక ఆ స్కూళ్లల్లో బాలికలకు కరాటే శిక్షణ!

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.
News October 23, 2025
NLG: భర్తీకి నోచని పోస్టులు.. ఆ దరఖాస్తులు ఏమయ్యాయి?

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టులు మంజూరైనా భర్తీకి నోచుకోవడం లేదు. ఈ కళాశాలలో రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టులను భర్తీ చేయగా.. ఏడాది కిందట మరో 237 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఏడాది దాటిన ఆ పోస్టుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News October 23, 2025
NLG: పర్వతరావు చెరువుకు రూ.1.22 కోట్లు మంజూరు

దేవరకొండ మండలంలోని పర్వతరావు చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.1.22 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు కావడం పట్ల ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు.