News February 9, 2025
అమ్మవారి సేవలో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ శనివారం రాత్రి సతీసమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఏఈవో దేవరాజులు, ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News October 15, 2025
పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News October 15, 2025
MBNR: బీసీలందరూ ఐక్యంగా పోరాడాలి: తీన్మార్ మల్లన్న

బీసీలందరూ ఐక్యంగా పోరాడాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, MLC తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ఈరోజు MBNRలో TRP ఆధ్వర్యంలో ఎర్ర సత్యంకు ఘన నివాళులర్పించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీలందరం ఏకతాటిపైకి వస్తేనే రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక నాయకులు, తీన్మార్ మల్లన్న టీం సభ్యులు, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
News October 15, 2025
HYD: బైక్ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

టూ వీలర్పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.