News November 19, 2024

అమ్మాయిలు ధీటుగా రాణించాలి: కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

image

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5శాతం మంది మాత్రమే మహిళా పైలెట్లు ఉండగా, మన దేశంలో 15శాతం మంది ఉండటం గమనార్హమని కేంద్ర పార విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఉమెన్‌ ఏవియేషన్‌ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా పైలెట్ల సంఖ్యను 25 శాతానికి పెంచడమే తన లక్ష్యమని ప్రకటించారు.

Similar News

News November 16, 2025

మరోసారి ఐపీఎల్‌కు సిక్కోలు యువకుడు

image

ఐపీఎల్‌-2026లో సిక్కోలు యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ మరోసారి మెరువనున్నాడు. టెక్కలికి చెందిన విజయ్‌ను రూ.30లక్షలకు రిటైన్ చేసుకున్నట్లు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో రానున్న ఐపీఎల్ సీజన్‌లో విజయ్ ఆడనున్నాడు. గత కొన్నేళ్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ శిక్షణ పొందుతూ పలు కీలక క్రికెట్ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు.

News November 16, 2025

SKLM: బంగారమంటూ పిలిచి.. బురిడీ కొట్టించాడు

image

ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుందామని ఆ యువతిని కుర్రాడు నమ్మించాడు. బంగారమంటూ పిలిస్తే..మురిసిపోయిందేమో యువకుడితో పెళ్లికి సిద్ధమైంది. శ్రీకాకుళానికి చెందిన వీరిద్దరూ HYDకు ఈనెల14న బయలుదేరారు. VJAలో బస్సు మారే క్రమంలో నగల బ్యాగ్‌, ఫోన్‌తో పారిపోయాడు. చావే దిక్కని ఏడుస్తున్న ఆమెను కృష్ణలంక పోలీసులు ప్రశ్నిస్తే విషయం తెలిసింది. దర్యాప్తు చేసి నగలతోపాటు యువతిని పేరెంట్స్‌కు నిన్న అప్పగించారు.

News November 16, 2025

SKLM: ‘క్రమశిక్షణ సమర్ధతతో కోర్టు కానిస్టేబుల్‌లు పనిచేయాలి’

image

క్రమశిక్షణ, సమర్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత కానిస్టేబుల్‌లతో సమావేశం నిర్వహించారు. కేసుల ఛార్జ్ షీట్‌లు దాఖలు చేసిన సమయంలో లోపాలు లేకుండా చూడాలని పబ్లిక్ ప్రాసెక్యూటర్లతో సమన్వయం ముఖ్యమన్నారు. రిఫర్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సమన్లు, వారంట్లు అమలులో ఆలస్యం జరగరాదాన్నారు. DCRB సీ‌ఐ శ్రీనివాస్ ఉన్నారు.