News February 26, 2025
అమ్రాబాద్లో సోషల్ ఆడిట్.. రూ.79,402 రికవరీ

అమ్రాబాద్ మండలంలో మంగళవారం 14వ రౌండ్ సోషల్ ఆడిట్ నిర్వహించారు. DRDO అదనపు అధికారి రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఆడిట్ నిర్వహించగా, 20 గ్రామ పంచాయతీల్లో మొత్తం రూ.79,402 రికవరీ చేశారు. ఇందులో రూ. 75,402 రికవరీ, రూ. 4,000 పెనాల్టీగా ఉంది. ఈ కార్యక్రమంలో SIM అజీమ్, విజిలెన్స్ నజీర్ రాజు, APO శ్రీనివాసులు, AO జంగయ్య, TA, PS తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News December 10, 2025
అన్క్లెయిమ్డ్ అమౌంట్.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి: PM

బ్యాంకుల్లో ₹78,000Cr అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయని PM మోదీ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ₹14KCr, మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల వద్ద ₹3KCr మిగిలిపోయాయన్నారు. ఖాతాదారులు/ఫ్యామిలీ మెంబర్స్ ఈ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు ‘యువర్ మనీ, యువర్ రైట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. UDGAM, బీమా భరోసా, SEBI, IEPFA పోర్టల్లలో వీటి వివరాలు తెలుసుకుని సంబంధిత ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు.
News December 10, 2025
జిల్లావ్యాప్తంగా 620 వార్డులు ఏకగ్రీవం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు వెల్లడించారు.


