News June 29, 2024
అమ్రాబాద్: టైగర్ సఫారీ టూర్ వాయిదా

అమ్రాబాద్ నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులు జులై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు టైగర్ సఫారీ టూర్ను వాయిదా వేసుకోవాలని, వణ్యప్రాణుల సంతానోత్పత్తి దృష్ట్యా ఈ సమయంలో సఫారీ టూర్ను రద్దు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ 3నెలలు శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వాహనాల వేగం 30కి మించరాదని, వన్యప్రాణుల స్వేచ్ఛకు ఎవరూ భంగం కల్గించరాదన్నారు. వన్యప్రాణులు ఉంటేనే పర్యావరణ, అటవీ సంపద, పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు.
Similar News
News October 25, 2025
MBNR: బాధితులకు న్యాయం జరుగేలా చూడాలి: SP

MBNR జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో కోర్ట్ డ్యూటీ, కోర్ట్ లైజన్ అధికారులతో ఎస్పి డి.జానకి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులో బాధితులకు న్యాయం జరుగేలా పోలీస్ అధికారులు సమయపాలన, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కోర్ట్ డ్యూటీ, లైజన్ అధికారులకు సంబంధిత ఫైళ్లు, సాక్షులు, పత్రాలు సమయానికి కోర్టులో సమర్పించే విధంగా స్పష్టమైన సూచనలు జారీ చేశారు.
News October 25, 2025
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి: కలెక్టర్

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదవాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం హన్వాడ మండలంలో కెజీబీవీని, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో కెజీబీవీని తనిఖీ చేశారు. ఆరో తరగతి విద్యార్థులతో విద్యా బోధన, భోజనం నాణ్యత ఇతర సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
News October 25, 2025
కౌకుంట్లలో అత్యధిక వర్షపాతం నమోదు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కౌకుంట్లలో 82.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సల్కర్పేటలో 53.5, దేవరకద్రలో 42.0, మహమ్మదాబాద్లో 35.8, అడ్డాకులలో 34.5, హన్వాడలో 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది.


