News February 5, 2025
అమ్రాబాద్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అమ్రాబాద్ మండలం బికే లక్ష్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
Similar News
News November 18, 2025
కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.
News November 18, 2025
కామారెడ్డి: వైద్యాధికారులకు శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్

కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లకు, పర్యవేక్షక సిబ్బందికి మంగళవారం శిశు స్వస్థ్యా శిక్షణ్ వర్క్ షాప్ నిర్వహించారు. నవజాత శిశు వారోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బందికి శిక్షణ అందించినట్లు GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. శిశు మరణాల తగ్గించేందుకు, చిన్నపిల్లల్లో జబ్బులను గుర్తించేందుకు శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. RMO,POలు పాల్గొన్నారు.
News November 18, 2025
కామారెడ్డి: ‘గణిత అధ్యాపకుడి కోసం దరఖాస్తు చేసుకోండి’

బిక్కనూర్ మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో పార్ట్ టైం ప్రాతిపాదికన గణిత శాస్త్రం బోధించేందుకు అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ రఘు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఎంపికైన అధ్యాపకుడికి రూ.23,400 వేతనం ఇస్తామని, అభ్యర్థులు MSC MATH B.ED/M.ED చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.


