News February 5, 2025
అమ్రాబాద్: పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

అమ్రాబాద్ మండలం బికే లక్ష్మాపూర్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారని, ప్రతిరోజు ఎంత మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ప్రభుత్వం మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు.
Similar News
News January 14, 2026
అనకాపల్లి-రాజమహేంద్రవరం మధ్య 6 లైన్ల రోడ్డుకి DPR జాప్యం

విశాఖ ఎకనామిక్ రీజియన్లో కీలకమైన గోదావరి జిల్లాలను విశాఖతో అనుసంధానించే జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టు DPR (డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్) దశలోనే జాప్యం జరుగుతోంది. రాజమహేంద్రవరం-అనకాపల్లి మధ్య 161 KM మేర ఉన్న 4 లైన్ల రహదారిని 6 లైన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. DPR ఖరారు కాకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టుకు సుమారు రూ.9,000 కోట్ల వరకు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా.
News January 14, 2026
పసిపిల్లలను ఎండలో ఎందుకు ఉంచాలంటే?

చిన్నారులకు ఇలా ఎండ తగిగేలా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఉదయం వచ్చే సూర్య రశ్మిపడితే శరీరానికి విటమిన్ డి లభిస్తుందనే విషయం తెలిసిందే. ఇది చిన్నారుల శరీరంలో కాల్షియం సంగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నెలలు నిండకముందు జన్మించిన చిన్నారుల్లో సూర్య రశ్మి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల్లో వచ్చే కామెర్ల సమస్యను కూడా దూరం చేయవచ్చు.
News January 14, 2026
అన్నమయ్య: మద్యం బాటిల్స్పై ధర పెంపు.!

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.


