News February 26, 2025
అమ్రాబాద్ : శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నేపథ్యమిదే..!

శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టుకు 1979లోనే అంకురార్పణ జరిగింది. 1982 జూలై 29న రూ.480 కోట్లతో సొరంగ మార్గం పనులు చేపట్టాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో చేసింది. కానీ ఎలాంటి పనులు మొదలు కాలేదు. 22 ఏళ్ల తర్వాత 2005లో దివంగత సీఎం వైఎస్అర్ ఎస్ఎల్బీసీ రూ.2,813కోట్ల అంచనాతో రెండు సొరంగాల నిర్మాణ పనులకు 2006 లో శంకుస్థాపన చేశారు. ప్రస్తుత అంచనావిలువ రూ.4,637.75 కోట్లకు చేరుకుంది.
Similar News
News November 21, 2025
సెయిల్లో 124 పోస్టులు.. అప్లై చేశారా?

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)లో 124 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.sail.co.in
News November 21, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 11

62. డంభం అంటే ఏమిటి? (జ.తన గొప్ప తానే చెప్పుకోవటం)
63. ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? (జ.తన భార్యలో, తన భర్తలో)
64. నరకం అనుభవించే వారెవరు? (జ.ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు)
65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? (జ.ప్రవర్తన మాత్రమే)
66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? (జ.మైత్రి)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 21, 2025
కగార్ ఎఫెక్ట్.. కలిసిపోతారా..? కొనసాగుతారా..?

ఆపరేషన్ కగార్ పేరిట వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఉమ్మడి కరీంనగర్(D) మంథని ప్రాంతం నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లా రాజిరెడ్డి @ సత్తెన్న సురక్షితంగానే ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. 1975లో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన హిడ్మా ఎన్కౌంటర్, అనారోగ్యంతో పోలీసులకు లొంగిపోతారా? ఉద్యమం సాగిస్తరా? అనేది చూడాలి.


