News April 9, 2025

అమ్రాబాద్: సలేశ్వరం జాతరకు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం సలేశ్వరం లింగమయ్య జాతరను ఏప్రిల్ 11 -13వ తేదీ వరకు అధికారికంగా నిర్వహించనున్నారు. అడవి శాఖ నిబంధనల మేరకు వాహనాలు ఫారెస్ట్‌లోకి ప్రవేశించేందుకు 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చారు. భక్తులు ఈ గడువులోపే దర్శనం ముగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News December 9, 2025

ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

image

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

News December 9, 2025

రాజధానిలో గ్రామకంఠాల సర్వే.. 13 బృందాలు రంగంలోకి

image

రాజధాని 29 గ్రామాల్లో గ్రామకంఠాల గందరగోళానికి చెక్ పెట్టేందుకు CRDA 13 సర్వే బృందాలను రంగంలోకి దించింది.
రైతులు మినహాయింపుల్లో అవకతవకలు ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ ఉంటారు. వారికి శిక్షణ ఇచ్చి త్వరలో గ్రామాల్లో సర్వే ప్రారంభిస్తారు. నివేదికలు అందిన తర్వాత మినహాయింపులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

News December 9, 2025

క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

image

విండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్‌గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్‌లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్‌లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.