News April 7, 2025
అయిజ: ‘అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దాం’

గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 12న జరిగే అంబేడ్కర్ ఆలోచన పండుగను జయప్రదం చేద్దామని అంబేడ్కరిస్ట్ వరదరాజు పేర్కొన్నారు. అయిజ మండలం కుట్కనూరు గ్రామంలో సోమవారం ఆలోచన పండుగ కరపత్రాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ వాదులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
తిరుపతి: ఐదుగురి స్టేట్మెంట్ రికార్డు

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసు విచారణలో భాగంగా పోలీసులు ఐదుగురి స్టేట్మెంట్లు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వర్సిటీకి సంబంధించి నలుగురు కాగా.. ఒడిశాలో యువతి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు. ఒడిశా వెళ్లిన సీఐ బుధవారం తెల్లవారుజామున తిరుపతికి రానున్నారు. ఆ తర్వాత పక్కా ఆధారాలతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.
News December 10, 2025
నేడు రోడ్డెక్కనున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు

TG: హైదరాబాద్లో కాలుష్యానికి పరిష్కారంగా ఇవాళ 65 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాణిగంజ్ RTC డిపోలో బస్సుల ప్రారంభ కార్యక్రమం జరగనుండగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేస్తుండగా, ఆ సంస్థే నిర్వహణ బాధ్యతలను చూసుకోనుంది. 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
News December 10, 2025
బుధవారం: గణపయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే?

వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన బుధవారం రోజున ఆయనకెంతో ఇష్టమైన నైవేద్యాలు సమర్పిస్తే మన కోర్కెలు తీరుస్తానని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ దేవి తనకెంతో ఇష్టంగా పెట్టే పాయసాన్ని పెడితే కుటుంబ జీవితం సంతోషంతో సాగుతుందట. ఉండ్రాళ్లు సమర్పిస్తే సంకటాలు పోతాయని, లడ్డూ నైవేద్యంతో కోరికలు తీరుతాయని పండితులు అంటున్నారు. బెల్లం-నెయ్యి, అరటి-కొబ్బరిని ప్రసాదాలలో చేర్చితే అధిక ఫలితం ఉంటుందని చెబుతున్నారు.


