News March 25, 2024
అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో..?

ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సెంటిమెంట్కు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయినవిల్లి వరసిద్ధి వినాయకుని దర్శనంతో అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం చుడతారు. ప్రచారం, నామినేషన్ల దాఖలు ఇలా ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశంలో వినాయకుని ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అభ్యర్థులు అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మరి అయినవిల్లి సెంటిమెంట్ ఎవరిని అందలం ఎక్కిస్తుందో.. వేచి చూడాలి.
Similar News
News September 14, 2025
రాజమండ్రి: లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారం

రాజమండ్రిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 4,733 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ జడ్జి మాధురి ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల ద్వారా బాధితులకు రూ.16.35 కోట్లకు పైగా పరిహారం అందనుంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్లు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు.
News September 13, 2025
15న యథాతథిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సెప్టెంబర్ 15న సోమవారం యథాతథిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను 1100 టోల్ ఫ్రీ నంబర్కు లేదా meekosam.ap.gov.in తెలియజేయాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల కేంద్రం పీజీఆర్ఎస్లో అందజేయాలన్నారు.
News September 13, 2025
ధవళేశ్వరం విచ్చేసిన సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేశారు. శనివారం గ్రామంలో జరిగిన మెండా సీతారామయ్య పెద్దకర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, పున్నమరాజు వీర్రాజు పాల్గొన్నారు.