News October 8, 2024
అయోమయ పరిస్థితిలో కాకాణి: బొబ్బేపల్లి
సర్వేపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు ఓటమితో కాకాణి గోవర్ధన్ రెడ్డి దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేశ్ నాయుడు అన్నారు. ముత్తుకూరులో ఆయన మాట్లాడారు. కాకాణి చేసిన అక్రమాల ఆనవాళ్లు సర్వేపల్లిలో ఇంకా చెక్కు చెదరలేదని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమీ చేయకపోగా ఇప్పుడు రోజూ ప్రెస్ మీట్లతో అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Similar News
News October 8, 2024
రేపు టీడీపీలో చేరనున్న బీద మస్తాన్ రావు
నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు బుధవారం టీడీపీలో చేరనున్నారు. ఈయన ఆగస్టు 29వ తేదీ రాజ్యసభ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరునున్నారు. 2019 డిసెంబర్లో ఈయన టీడీపీ నుంచి వైసీపీలో చేరారు.
News October 8, 2024
వాకాడు: టీడీపీ నేత సంచలన ప్రకటన
వాకాడు మండలం రాగుంటపాలెం పంచాయతీకి చెందిన వైసీపీ నాయకులు నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన వాకాడు మండల టీడీపీ బీసీ సెల్ నాయకుడు చెన్నపట్నం జమిందార్ బాబు సంచలన ప్రకటన చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన నాయకులను టీడీపీలో చేర్చుకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. గతంలో తనపై ఎన్నో కేసులు పెట్టారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోవద్దన్నారు.
News October 8, 2024
నెల్లూరు: గుండెపోటుతో యువకుడి మృతి
గూడూరు నుంచి పనుల మీద రాపూరు వచ్చిన శివ అనే యువకుడు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పు ఆగర్త కట్టకు వెళ్లే దారిలో శివ నడచి వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపడి గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు రాపూరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏఎస్ఐ వెంకటేశ్వర రావు ఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. మృతదేహన్ని ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.