News April 9, 2024
అయ్యన్న, సీఎం రమేశ్కు నోటీసులు జారీ

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేత అయ్యన్న, బీజేపీ నేత సీఎం రమేశ్కు ఆర్డీఓ జయరాం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న బీజేపీ సమావేశానికి హాజరైన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసేందుకు వచ్చారు. వారి ఎదుట అయ్యన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తీవ్ర పదజాలంతో విమర్శించారని, సీఎం రమేశ్ పక్కనే ఉన్నారని.. ఇద్దరి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
Similar News
News April 8, 2025
CREDAI విశాఖ చాప్టర్ ఛైర్మన్గా ధర్మేందర్

కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI) విశాఖ చాప్టర్ 2025-26 చైర్మన్ గా వి. ధర్మేందర్, అధ్యక్షుడిగా ఇ.అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా వి.శ్రీను ఎన్నికయ్యారు. కోశాధికారిగా కె.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేస్తామని కార్యవర్గం ప్రకటించింది. విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో CREDAI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
News April 8, 2025
విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

విశాఖ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో రిషి(7) మృతి చెందాడు. గుట్టు చప్పుడు కాకుండా బైక్పై ప్రైవేట్ ఆసుపత్రికి స్పోర్ట్స్ క్లబ్ సిబ్బంది తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించగా.. బంధువులు ఆందోళనకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
విశాఖలో నేటి కాయగూరల ధరలు

విశాఖ 13 రైతు బజార్లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం నాడు కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ.కేజీ)లో టమాటా రూ.16, ఉల్లిపాయలు రూ.21, బంగాళదుంపలు రూ.17, మిర్చి రూ.26, పికోడా మిర్చి రూ.60, క్యారెట్ రూ.36, మట్టి చామ రూ.28, చిలకడదుంపలు రూ.40, బద్ద చిక్కుడు రూ.62, మామిడి అల్లం రూ.55, కీరదోస రూ.24, కాలీఫ్లవర్ రూ. 20, బెండ రూ.28, బీరకాయలు రూ.42, వంకాయలు రూ.22/28 గా ధరలు నిర్ణయించారు.