News January 25, 2025

అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

image

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం అన్నారు.

Similar News

News November 30, 2025

HYD: ఏడడుగుల బంధం ఏమైపోతోంది?

image

ఆలుమగల నడుమ అన్యోన్యం అటకెక్కుతోంది. మూడుముళ్ల బంధం ముక్కలువుతోంది. ఒడిదుడుకులు తట్టుకోవాల్సిన వారు ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకుంటున్నారు. జీలకర్ర బెల్లంలా కలిసి ఉండాల్సిన వారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బోడుప్పల్‌లో ఆగస్టు 24న గర్భవతైన భార్యను భర్త ముక్కలు చేసి చంపేశాడు. తాజాగా ఇదే ప్రాంతంలో భర్తను కుమారుడు, మేనల్లుడితో కలిసి కడ తేర్చింది ఓ భార్య. వరుస ఘటనలు దంపతుల ప్రేమను దహించేస్తున్నాయి.

News November 30, 2025

HYD: ఏడడుగుల బంధం ఏమైపోతోంది?

image

ఆలుమగల నడుమ అన్యోన్యం అటకెక్కుతోంది. మూడుముళ్ల బంధం ముక్కలువుతోంది. ఒడిదుడుకులు తట్టుకోవాల్సిన వారు ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకుంటున్నారు. జీలకర్ర బెల్లంలా కలిసి ఉండాల్సిన వారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బోడుప్పల్‌లో ఆగస్టు 24న గర్భవతైన భార్యను భర్త ముక్కలు చేసి చంపేశాడు. తాజాగా ఇదే ప్రాంతంలో భర్తను కుమారుడు, మేనల్లుడితో కలిసి కడ తేర్చింది ఓ భార్య. వరుస ఘటనలు దంపతుల ప్రేమను దహించేస్తున్నాయి.

News November 30, 2025

బాడీ బిల్డర్‌ని కొట్టి చంపేశారు

image

హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన ప్రొఫెషనల్ బాడీ బిల్డర్‌, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ రోహిత్‌ను దుండగులు కొట్టి చంపేశారు. ఓ బరాత్‌లో కొందరు ఆకతాయిలు మహిళలను ఏడిపిస్తుంటే రోహిత్ వారిని వారించాడు. వాళ్లు దారికాచి 20మంది కర్రలతో రోహిత్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రోహిత్ శరీరంపై గాయంకాని ప్రదేశమేలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.