News January 25, 2025

అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

image

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా నిషేధం అన్నారు.

Similar News

News October 18, 2025

విజయవాడలో ఏసీబీకి పట్టుబడిన అటెండర్

image

విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి తిమింగలం కొండపల్లి శ్రీనివాస్‌ను ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. గవర్నర్‌పేటలో అటెండర్‌గా పనిచేసే శ్రీనివాస్, వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. ఓ ట్రాన్స్‌పోర్టు యజమాని వద్ద రైడ్స్ సాకుతో నగదు వసూలు చేస్తుండగా, ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు బృందం వలపన్ని పట్టుకుంది.

News October 18, 2025

ప్రభుత్వం కీలక నిర్ణయం.. పెళ్లికి ముందే కౌన్సెలింగ్

image

TG: వివాహబంధాల్లో పెరుగుతున్న ఘర్షణలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రీ మారిటల్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న సఖీ, వన్ స్టాప్ కేంద్రాల్లో రూ.5 కోట్ల వ్యయంతో వీటిని పెట్టనుంది. ప్రతి సెంటర్‌లో లీగల్ కౌన్సెలర్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్, హెల్పర్ ఉంటారు. వివాహబంధంలోకి అడుగుపెట్టాలనుకునే వారు వీటిల్లో కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.

News October 18, 2025

గొల్లప్రోలు: అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై తేలాడు

image

మూడు వారాల క్రితం అదృశ్యమైన వ్యక్తి బావిలో శవమై కనిపించాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన ముర్రే రామకృష్ణ (49) సెప్టెంబరు 24వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీనిపై అతని భార్య ఎల్లావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ శివారులోని బావిలో శుక్రవారం రామకృష్ణ మృతదేహాన్ని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.