News January 25, 2025
అరకులోయలో చలి ఉత్సవాలకు ఏర్పాట్లు

అల్లూరి జిల్లా అరకులోయలో మూడు రోజులపాటు చలి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. మారథాన్, వివిధ రాష్ట్రాల నుంచి గిరిజన సంప్రదాయ కార్నివాల్, పద్మాపురం గార్డెన్లో ఫ్లవర్ షో, వివిధ స్టాల్స్, ఫుడ్ స్టాల్ ఉంటాయన్నారు. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం అన్నారు.
Similar News
News November 14, 2025
రాహుల్, కేటీఆర్ ఐరన్ లెగ్స్: బండి

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.
News November 14, 2025
HNK: మెరుగైన సేవలు అందించాలి: DMHO

ఆరోగ్య సమస్యలతో ప్రాథమిక కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఓపికతో వారి సమస్యలను విని అవసరమైన సేవలు అందించాలని DMHO అప్పయ్య అన్నారు. ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్ రిజిస్టర్ని పరిశీలించి ఎంతమంది ఏ విధమైన సమస్యలతో వస్తున్నారని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
News November 14, 2025
జిల్లా వ్యాప్తంగా పంచారామాలకి బస్సులు

పంచారామ క్షేత్రాల దర్శనానికి కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి ఏలూరు జిల్లా వ్యాప్తంగా సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ప్రజా రవాణా అధికారి ఎస్కే షబ్నం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి డిపో నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


