News September 23, 2024
అరకులోయలో నెత్తుటి చారికకు ఆరేళ్లు..!

23/9/2018 మన్యం ప్రజలు మరిచిపోలేని రోజు. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమును మవోయిస్టులు అతి కిరాతంగా చంపిన రోజు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద ఇద్దరు నేతలను మావోయిస్టులు హతమార్చి నేటికి ఆరేళ్లు గడుస్తోంది. అనంతరం కిడారి కుమారుడు శ్రవణ్ కుమార్ మంత్రిగా పనిచేయగా.. సివేరి కుమారుడు అబ్రహం గత ఎన్నికల్లో TDP తరఫున రెబల్ అభ్యర్థిగా బరిలో దిగి సస్పెన్షన్కు గురయ్యారు.
Similar News
News November 18, 2025
కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.
News November 18, 2025
కంచరపాలెంలో 21న జాబ్ మేళా

కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయం NCSCలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉప ఉపాధి కల్పనాధికారి శ్యామ్ సుందర్ తెలిపారు. 200 పోస్టులకు మేళా చేపడుతుననట్లు ఆయన చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 18-35 ఏళ్ల వయసున్న వారు అర్హులుగా పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, చెన్నైలో పనిచేయాల్సి ఉంది.
News November 18, 2025
కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.


