News April 14, 2025
అరకు: ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా

అరకులోయ ఆర్ఐటీఐ కళాశాలలో ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా జరుపుతున్నట్లు ప్రిన్సిపల్ వేంకటేశ్వర రావు తెలిపారు. జాబ్ మేళాలో పలు స్టార్ హోటల్స్, ఫార్మా, కెమికల్, ఐటీ కంపెనీలు పాల్గొని తమ ఖాళీలను భర్తీ చేస్తాయని అన్నారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, R&AC ట్రేడులు పాసైనవారు పాల్గొనాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, 2 పాస్ ఫొటోలు, జిరాక్స్లతో రావాలని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
HNK టౌన్హాల్కి శతాబ్దం.. శతవత్సరాల చారిత్రక సాక్ష్యం

వరంగల్ నగరంలో నిలిచిన హనుమకొండ టౌన్హాల్కు శతవత్సరం పూర్తైంది. 1924లో పునాదిరాయి వేసి ఏడో నిజాం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కట్టడం నేటికీ చారిత్రక ప్రతీకగా నిలుస్తోంది. ‘మహబూబ్ బాగ్’ పేరుతో 7 ఎకరాల్లో నిర్మించిన ఈ గార్డెన్కి అప్పట్లో రూ.2 లక్షలు మంజూరు చేశారు. ఒకప్పుడు చిన్న జూపార్క్గా ఉన్న ఇక్కడ.. నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంతో సాంస్కృతిక కేంద్రంగా కొనసాగుతోంది.
News November 27, 2025
‘ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశాం’

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిచేందుకు ఆస్పత్రులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసంస్థల నమోదు, నిబంధనల అమలు, సేవల నాణ్యత, ప్రజారోగ్య పరిరక్షణ అంశాలపై విస్తృతంగా చర్చ జరిపి 46 ప్రైవేట్ ఆసుపత్రులకు శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరు చేశామన్నారు.
News November 27, 2025
రాష్ట్రంలో 60 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (<


