News April 14, 2025
అరకు: ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా

అరకులోయ ఆర్ఐటీఐ కళాశాలలో ఈ నెల 15న పీఎం నేషనల్ అప్రెంటీస్ షిప్ మేళా జరుపుతున్నట్లు ప్రిన్సిపల్ వేంకటేశ్వర రావు తెలిపారు. జాబ్ మేళాలో పలు స్టార్ హోటల్స్, ఫార్మా, కెమికల్, ఐటీ కంపెనీలు పాల్గొని తమ ఖాళీలను భర్తీ చేస్తాయని అన్నారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, R&AC ట్రేడులు పాసైనవారు పాల్గొనాలన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు, 2 పాస్ ఫొటోలు, జిరాక్స్లతో రావాలని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
బల్దియా.. బడా హోగయా!

ORR సమీపంలోని 20 పట్టణాలు, 7 నగరాలు GHMCలో విలీనమయ్యాయి. DEC 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చేసింది. దీంతో విస్తీర్ణం, జనసాంద్రత, పరిపాలనా విభాగాల పరంగా GHMC దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలు, నగరాల రికార్డులను స్వాధీనం చేసుకునే బాధ్యత డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
News December 3, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ: భద్రాద్రి కలెక్టర్
✓టేకులపల్లి: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ
✓కొత్తగూడెం: ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసిన కలెక్టర్
✓పినపాక: ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలి: సీఐ
✓సైబర్ నేరాల నివారణకు 42 రోజులు పాటు అవగాహన
✓చర్ల: మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదు: CPIML
✓ జిల్లాలో 6 బయో ఇన్ పుట్ సెంటర్లు: కేంద్ర సహాయ మంత్రి
✓కొత్తగూడెం: రైల్వే ట్రాక్ పై నాటు బాంబు కలకలం
News December 3, 2025
జనగామ: ఏకగ్రీవం అయిన చోట రేపు ఎన్నికలు: కలెక్టర్

జనగామ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డ్ మెంబర్ గ్రామాల్లో రేపు ఉప సర్పంచ్ ఎన్నికలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా మండలాల్లో సంబంధిత ఎంపీడీవోలు ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పటిష్ఠమైన భద్రత చర్యలు ఏర్పాటు చేయనున్నట్లు వారు అన్నారు.


