News April 9, 2025

అరకు: ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభించిన పవన్ కల్యాణ్

image

అరకులోయ మండలం సుంకరమెట్ట దగ్గరలోని APFDC కాఫీ తోటల్లో ఉడెన్ బ్రిడ్జిని మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఉడెన్ బ్రిడ్జి అధ్బుతంగా ఉందని పవన్ కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ చైర్మన్ ఆర్వీఎస్కే రంగారావు పాల్గొన్నారు. రూ.43 లక్షలతో బ్రిడ్జిని నిర్మించినట్లు ఏపీఎఫ్డీసీ అధికారులు తెలిపారు.

Similar News

News December 6, 2025

గద్వాల్: మూడో విడతలో 438 నామినేషన్లు

image

మూడో విడత నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అల్లంపూర్ సర్పంచ్ (90), వార్డు మెంబర్లకు (282), ఇటిక్యాల సర్పంచ్ (63), వార్డ్ మెంబర్లు(244), మానవపాడు సర్పంచ్ (87), వార్డు మెంబర్లు (320), ఎర్రవల్లి సర్పంచ్ (98), వార్డ్ మెంబర్లు (330), ఉండవెల్లి సర్పంచ్ (100), వార్డ్ మెంబర్లు (330) మొత్తం 438 సర్పంచ్, 1489 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 6, 2025

గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

image

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్‌(58*)తో కలిసి న్యూజిలాండ్‌కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.

News December 6, 2025

Meesho: ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుంది..

image

IIT గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయ, సంజీవ్ బర్న్వాల్ 2015లో ఓ ప్రయోగంలా ప్రారంభించిన స్టార్టప్ ‘మీషో’. చిన్న వ్యాపారులకు వేదికగా నిలిచింది. ధరలు తక్కువ కావడటంతో సేల్స్ పెరిగాయి. ఐదేళ్లలో కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. 2025 FYలో ₹9,390 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇప్పుడు ₹5,421 కోట్ల IPOతో స్టాక్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి మీషో సిద్ధమవుతోంది. ప్రయత్నిస్తే ఫలితం ఇలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.