News April 9, 2025
అరకు: ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభించిన పవన్ కల్యాణ్

అరకులోయ మండలం సుంకరమెట్ట దగ్గరలోని APFDC కాఫీ తోటల్లో ఉడెన్ బ్రిడ్జిని మంగళవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో ఉన్న ఉడెన్ బ్రిడ్జి అధ్బుతంగా ఉందని పవన్ కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ చైర్మన్ ఆర్వీఎస్కే రంగారావు పాల్గొన్నారు. రూ.43 లక్షలతో బ్రిడ్జిని నిర్మించినట్లు ఏపీఎఫ్డీసీ అధికారులు తెలిపారు.
Similar News
News September 16, 2025
భూమికి సమీపంగా భారీ ఆస్టరాయిడ్

ఓ భారీ గ్రహశకలం త్వరలో భూమికి సమీపంగా రానున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2025 FA22 అనే ఆస్టరాయిడ్ సెప్టెంబర్ 18 ఉ.8.33 గం.కు భూమికి అత్యంత సమీపంలోకి రానుందని చెబుతున్నారు. అప్పుడు ఇది భూమికి 8,41,988 కి.మీ. దూరంలోనే ప్రయాణించనుంది. అయితే ఆ శకలం గురుత్వాకర్షణ పరిధిలోకి రాదని అంటున్నారు. దీని చుట్టుకొలత 163.88 మీ., పొడవు 280 మీ.గా ఉంది. నాసా దీని కదలికలను పరిశీలిస్తోంది.
News September 16, 2025
మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ కన్నుమూత

కాకినాడకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ ఎస్. సత్యదేవ్ (84) అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. 1964-65 సీజన్లో విశాఖపట్నం – హైదరాబాద్తో ఆయన అరంగేట్రం చేశారు. ఆల్ రౌండర్గా గుర్తింపు పొందారు. 16 రంజీ మ్యాచ్ల్లో ఒక సెంచరీతో సహా 503 పరుగులు చేశారు. ఆయన మృతికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీశ్ బాబు, తూ.గో క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
News September 16, 2025
HYDలో ఒక్కో ఎకరం రూ.101 కోట్లు

రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల భూమిని వచ్చే అక్టోబర్ 6న ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరను రూ.101 కోట్లుగా నిర్ణయించి, వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల విక్రయంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల ఆదాయం రాబోతుందని అంచనా. నగరంలో అత్యంత ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ భూములపై ఇప్పటికే పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.