News August 13, 2024

అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

image

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.

Similar News

News December 18, 2025

కేజీహెచ్‌లో చిన్నారికి అరుదైన వెన్నెముక శస్త్రచికిత్స

image

అనకాపల్లి జిల్లాకు చెందిన 9 ఏళ్ల తేజస్విని అనే చిన్నారికి విశాఖ కేజీహెచ్ వైద్యులు క్లిష్టమైన వెన్నెముక శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. టీబీ కారణంగా తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆమెకు సుమారు రూ.4 లక్షల విలువైన ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా అందించారు. న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. ప్రేమ్ జిత్ రే బృందం చేసిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని సుప్రెండెంట్ వాణి తెలిపారు.

News December 18, 2025

విశాఖ: సైకిల్ ట్రాక్‌ల ఏర్పాటుకు పరిశీలన చేసిన కమిషనర్

image

నగరంలోని ముడసర్లోవ, రాడిసన్ బ్లూ హోటల్, సాగర్ నగర్ ప్రాంతాల్లో సైకిల్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయా ప్రాంతంల్లో పర్యటించి ట్రాక్ పనులపై జీవీఎంసీ ఈఈ, ఇతర అధికారులతో కమిషనర్ చర్చించి సూచనలు చేశారు. అలాగే బీచ్ రోడ్లో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు, మధురవాడలో ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.

News December 18, 2025

కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం

image

బురుజుపేట కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం నాల్గో గురువారం సందర్భంగా సహస్ర ఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈఓ శోభారాణి చేతులు మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
మార్గశిర మాసం చివరి గురువారం కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈఓ శోభరాని అన్ని ఏర్పాట్లు చేశారు.