News August 13, 2024
అరకు ఎంపీ ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టులో సవాల్

అరకు ఎంపీ తనూజా రాణి ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ అభ్యర్థి గీత హైకోర్టును ఆశ్రయించారు. ఆమె ఎన్నికల అఫిడవిట్లో అవాస్తవాలు చూపారని ఆరోపించారు. ఓట్ల పరంగా రెండో స్థానంలో ఉన్న తనను ఎన్నికైనట్లు ప్రకటించాలన్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు తనూజాతో పాటు పదిమంది అభ్యర్థులకు, లోక్ సభ సెక్రటరీ జనరల్, అరకు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది.విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
Similar News
News December 15, 2025
విశాఖ: డిసెంబర్ 21న పల్స్ పోలియో

విశాఖలో డిసెంబర్ 21న పల్స్ పోలియో నిర్వహించనున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఇప్పటికే సూచించారు. జిల్లాలో 2,09,652 మంది ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే 1062 పల్స్ పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల తల్లిదండ్రులు ఈ విషయన్ని గమనించాలని అధికారులు కోరారు.
News December 15, 2025
విశాఖ: పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు స్ఫూర్తి

పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా విశాఖ కలెక్టరేట్లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తి అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు
News December 15, 2025
గాజువాకలో యువతి ఆత్మహత్య

గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్లోని హిమచల్ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.


