News February 17, 2025
అరకు: క్వెస్ట్లో విజేతలకు నగదు బహుమతి

అల్లూరి జిల్లా అరకు చలి ఉత్సవంలో ది గ్రేట్ అరకు క్వెస్ట్లో గెలుపొందిన విజేతలకు పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ దినేష్ కుమార్ నగదు బహుమతి ఆదివారం అందించారు. ప్రథమ స్థానంలో నిలిచిన ధ్రువ అండ్ టీమ్కు రూ. 50,000, ద్వితీయ స్థానంలో ఉన్న మంగతల్లి టీమ్కు రూ. 30,000, తృతియ బహుమతి రూ. 20,000లను భాస్కర్ రెడ్డి టీమ్కి అందజేశారు. మ్యూజియం క్యూరేటర్ వి మురళి, ఆయా బృంద సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
పెద్దపల్లి: 16 నెలల చిన్నారి మృతి

ముత్తారంలో విషాదం నెలకొంది. లక్కారం గ్రామానికి చెందిన శ్రీనివాస్-తారకల కుమార్తె అభిజ్ఞ(16 నెలల) చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారికి జ్వరం రావడంతో కుటుంబీకులు పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్లో చికిత్స అందించారు. అస్వస్తతకు గురవడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని కుటుంబీకులు ఆరోపించారు.
News October 23, 2025
వరంగల్: ధాన్యం బకాయిలపై ప్రభుత్వ కఠిన చర్యలు

2021-22 నుంచి 2023-24 వరకు WGL, HNK, MHBD, JNG, BPL, MLG జిల్లాల్లో 32 మంది మిల్లర్లు 74,818 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి పెట్టారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మిల్లర్లను డీఫాల్టర్ జాబితాలో చేర్చి, సీఎంఆర్ ధాన్యం కేటాయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 1,220 కేంద్రాల్లో 28.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొననున్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: KCR ప్లాన్ ఇదే!

జూబ్లీహిల్స్ బైపోల్ కోసం KCR వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో నేడు సమావేశం అవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి నేతలకు సూచనలు ఇస్తారు. ఇప్పటికే స్థానిక INC, బీజేపీ నేతలతో కేటీఆర్ రహస్య సమావేశం అయినట్లు సమాచారం. ఉప ఎన్నిక ముందు జూబ్లీహిల్స్లో కీలక నాయకులను BRSలోకి ఆహ్వానించి, కాంగ్రెస్, BJPని బలహీనపరచాలని KCR ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.