News January 10, 2025
అరకు: ‘గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా చలి అరకు ఉత్సవం’
గిరిజన సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించేలా చలి అరకు ఉత్సవం నిర్వహించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. చలి అరకు ఉత్సవంపై గురువారం సమావేశమయ్యారు. సాంస్కృతిక ప్రదర్శనకు అవసరమైన కళాకారుల వివరాలు సేకరించి రవాణా, వసతి సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రతీ రోజు నిర్వహించవలసిన కార్యక్రమాలపై చర్చించారు. ఫుడ్ కోర్టులు, ఎమ్యూజ్మెంట్, పార్కింగ్, స్టాల్స్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
Similar News
News January 18, 2025
నేడు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు శనివారం విశాఖ నుంచి చర్లపల్లికి (08549/50)ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ కుమార్ తెలిపారు. ఈరోజు సాయంత్రం విశాఖలో 7:45కు బయలుదేరుతుంది. దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు మీదుగా రేపు తెల్లవారి 7 గంటలకు చర్లపల్లి చేరుతుంది. 2nd AC, 3rd AC, స్లీపర్, జనరల్ ఉంటాయాన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
News January 18, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేరు డాక్టర్స్ కాలనీలోని ఓ ఇంటిపై టాస్క్ ఫోర్స్ సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లాప్టాప్, రెండు మొబైల్స్, 80 బ్యాంకు అకౌంటులను స్వాధీనం చేసుకొని వాటిలో రూ.140కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లావాదేవీలకు సహకరించిన నలుగురుని అదుపులోకి తీసుకొని రిమాండుకు తరలించారు.
News January 18, 2025
విశాఖ: నేడు స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్.. కలెక్టర్ సూచనలు
స్వచ్ఛాంధ్ర –స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం కావాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని, గార్బేజ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో సేవలు అందించాలని సూచించారు.